ర‌వితేజ మిస్ అయిన ప్ర‌భాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా... బ్యాడ్‌ల‌క్ మాస్ మ‌హ‌రాజ్‌..!

RAMAKRISHNA S.S.
టాలీవుడ్‌లో అయినా.. ఏ సినిమా రంగంలో ఏ భాషలో అయినా.. ఒక హీరో చేయాల్సిన సినిమాను మరొక హీరో చేసి సూపర్ హిట్లు కొడుతూ ఉంటారు. ఇది కామన్‌గా జరుగుతూ ఉంటుంది. అలాగే మాస్ మహారాజ్ రవితేజ కెరీర్‌లో కూడా.. ఒక బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అయింది. ఆ సినిమాను యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ప్రబాస్ హీరోగా కొరటాల శివ దర్శకుడుగా పరిచయం అయిన సినిమా మిర్చి. 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా అనుష్క, రీచా గంగోపాధ్యాయ హీరోయిన్గా నటించారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. వాస్తవానికి ఈ సినిమా చేయటానికి ముందే ప్రభాస్ రాజమౌళితో బాహుబలి సినిమాకు కమిట్ అయ్యారు. కొరటాల శివ ముందుగా కథను రవితేజకు వినిపించారు. రవితేజ బ్లాక్ బస్టర్ సినిమా భద్ర సినిమాకి.. కొరటాల శివ మాటలు అందించారు. ఆచనువుతోనే రవితేజకి ముందుగా కథ చెప్పారు. రవితేజ ఈ కథను రిజెక్ట్ చేయడంతో.. ఇదే స్టోరీని ప్రభాస్‌కు చెప్పగా ప్రభాస్ సింగిల్ టేక్ లో ఓకే చేసి పడేశారు.

అప్పటికే బాహుబలికి కమిటీ అయిన ప్రభాస్‌కు.. మిర్చి సినిమా చేయాలా.. వద్ద.. అన్న సందేశం ఏర్పడింది. చివరకు రాజమౌళి దగ్గర పర్మిషన్ తీసుకుని కేవలం 6 నెలల గ్యాప్‌లో మిర్చి సినిమాను పూర్తి చేశాడు. అలా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రభాస్‌కు బాహుబలి సినిమాకు ముందు మిర్చి బూస్ట్ గా నిలిచింది. మిర్చి తర్వాత కొరటాల శివ.. మహేష్ బాబుతో శ్రీమంతుడు, భరత్ అనే నేను ఆ తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ లాంటి సూపర్ డూపర్ హిట్లు తెరకెక్కించారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో తెర‌కెక్కించిన దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: