ఖడ్గం సినిమాలో నాగార్జున నటించకపోవడానికి కారణం..?

Divya
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన కృష్ణవంశీ తెరకెక్కించిన ఖడ్గం సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఇందులో సీనియర్ హీరో శ్రీకాంత్ తో పాటు రవితేజ, సంగీత, నటుడు ఉత్తేజ్ ,సోనాలి బింద్రే తదితర నటీనటుల సైతం నటించారు. దేశభక్తిని చాటే సినిమాగా ఈ చిత్రం ఆకట్టుకుంది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారట. నిన్నటి రోజున అక్టోబర్ 18 కావడం చేత ఈ చిత్రాన్ని థియేటర్లో రీ రిలీజ్ చేశారట. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణవంశీ ఖడ్గం సినిమా గురించి కొన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడం జరిగింది.

ఖడ్గం సినిమా విషయంలో శ్రీకాంత్ నటించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో మొదట శ్రీకాంత్ ని అనుకోలేదట.. నిర్మాతలు హీరో నాగార్జునని తీసుకోవాలనుకున్నారట. అంత సీరియస్ లుక్స్ లో నాగార్జున నటిస్తే సెట్ అవ్వదని కృష్ణవంశీ చెప్పిన కూడా నిర్మాతలు వినలేదట. గతంలో నాగార్జునతో రెండు చిత్రాలు తీసిన అనుభవంతో చెబుతున్నానని.. నాగార్జున ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ కి సరిపోరని కచ్చితంగా ఈ సినిమా పైన ప్రభావం చూపుతుంది అంటు ముందుగానే నిర్మాతలకు హింట్ ఇచ్చారట కృష్ణవంశీ.

దీంతో చివరికి నిర్మాతలు కూడా శ్రీకాంత్ కి లుక్ టెస్ట్ చేసి  మరి తీసుకోవడంతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఒకపక్క సీరియస్ లుక్కలో చూపిస్తూనే మరొకపక్క లవ్ ట్రాక్ ని కూడా అద్భుతంగా చూపించారు డైరెక్టర్ కృష్ణవంశీ. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడి పని చేశారని.. అందువల్లే ఖడ్గం సినిమా బ్లాక్ బస్టర్ అయిందని ఇప్పటికీ ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే చాలు కచ్చితంగా ఖడ్గం సినిమా ఎక్కడో ఒకచోట ప్రసారం అవుతూ ఉన్నది. అంతేకాకుండా ఈ సినిమా చేస్తున్న సమయంలో చాలామంది కూడా బెదిరింపులు వచ్చాయని  చాలామందికి తెలియజేశారు. మొత్తానికి నాగార్జున ఖడ్గం సినిమాలో నటించి ఉంటే అంత సక్సెస్ అయ్యేది కాదేమో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: