న‌లుగురు స్టార్ హీరోలతో సీనియర్ డైరెక్టర్ క్రేజీ మల్టీస్టారర్..!

Amruth kumar
. . . ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
మన తెలుగు చిత్ర పరిశ్రమ లో మల్టీస్టారర్ సినిమాల కు కొదవలేదు .. మన పాత తరం హీరో లైన ఎన్టీఆర్ , నాగేశ్వరరావు , కృష్ణ , శోభన్ బాబు వంటి వారు కూడా స్టార్ హీరోలుగా ఉంటూనే కలిసి సినిమాలు చేశారు . ముఖ్యంగా ఎన్టీఆర్ - నాగేశ్వరరావు కలిసి 14 సినిమాలకు పైగా మల్టీస్టారర్‌ల్లో నటించారు . అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా 30కు పైగా మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు . ఇదే క్రమంలో నేటి తరం హీరోలు కూడా కథలు నచ్చితే మల్టీస్టార‌ర్‌ సినిమా లు చేయడానికి కూడా రెడీ అంటూ వ‌స్తున్న‌రు .

ఇప్పటికే రాజమౌళి ఎన్టీఆర్ - రామ్ చరణ్ తో కలిపి త్రిబుల్ ఆర్ సినిమా తెరకెక్కించి ఆస్కార్ వరకు తీసుకువెళ్లాడు .. అలాగే  తెలుగు సినిమా ఖ్యాతినిపెంచాడు.. అంతే కాకుండి గతంలో వెంకటేష్ - మహేష్ బాబు క‌లిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఓ స్టార్ దర్శకుడు మాత్రం ఎవరు ఊహించుని భారీ మల్టీస్టారర్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది .

అంతేకాకుండా అందు లో నలుగురు స్టార్ హీరోలు,  హీరోలుగా నటించబోతున్నారట . ఇప్పటి కే ఆ నలుగురు హీరోలకు కథ కూడా వివరించినట్టు టాలీవుడ్ వర్గ‌ల నుంచి అందుతున్న‌ సమాచారం . అలానే ఈ సినిమా ని కూడా ఆ నలుగురు హీరోలే నిర్మించాలని కూడా భావిస్తున్నారట . వచ్చే సంక్రాంతి తర్వాత ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా ప్రారంభించాలని ఆ స్టార్ దర్శకుడు భావిస్తున్నట్టు తెలుస్తుంది . ఇక మరి ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఆ దర్శకుడు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: