విక్రమార్కుడు తర్వాత నన్ను ఎవరు సరిగ్గా వాడుకోలేదు.. అజయ్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటుడు గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో అజయ్ ఒకరు . ఈయన ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో నటిం చాడు. అందులో కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను సాధించడంతో ఈయనకు మంచి గుర్తింపు లభించింది. తాజాగా ఈయన పొట్టేలు అనే సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఓ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ ఈవెంట్లో భాగంగా ఏ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన అజయ్ మాట్లాడారు.

ఇక ఈ సినిమా ఈవెంట్ లో అజయ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అజయ్ "పొట్టేలు" సినిమా ఈవెంట్లో భాగంగా మాట్లాడుతూ ... నేను చాలా సంవత్సరాల క్రితం విక్రమార్కుడు సినిమాలో విలన్ పాత్రలో నటించాను. ఆ సినిమాలోని ప్రతి నాయకుడి పాత్ర ద్వారా నాకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత నేను చాలా సినిమాల్లో విలన్ పాత్రలలో నటించాను. కానీ విక్రమార్కుడు సినిమాలో నన్ను వాడుకున్నంతగా ఏ సినిమాలోను ఎవరు విలన్ పాత్రలో వాడుకోలేదు.

చాలా సంవత్సరాల తర్వాత పొట్టేలు సినిమాలో విలన్ పాత్రలో నేను అద్భుతంగా నటించాను. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. కచ్చితంగా ప్రేక్షకులందరినీ ఈ మూవీ ఆకట్టుకుంటుంది అని అజయ్ చెప్పుకొచ్చాడు. ఇలా అజయ్ "పొట్టేలు" సినిమా గురించి చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో భారీగా పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో , బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: