ప్రశాంత్ నీల్ తో అల్లు అర్జున్.. ఆ హీరోను గట్టిగానే టార్గెట్ చేశాడుగా..!

Amruth kumar
పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.. సౌత్ కంటే నార్త్ ఆడియన్స్ పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 6న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాను కూడా దర్శకుడు సుకుమార్ ఊహించని రీతిలో తెరకెక్కించాడు. అలాగే పుష్ప 3 సినిమా కూడా రాబోతుందనే హింటు కూడా ఇచ్చాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత  సినిమాని ఏ డైరెక్టర్ తో చేస్తాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ వర్గాల నూంచి అందుతున్న సమాచారం మేరకు త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో  అల్లు అర్జున్ తర్వాత సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ గా మారింది. అసలు మ్యాటర్ లోకి వెళ్తే అల్లు అర్జున్ తన తర్వాత సినిమాని ప్రశాంత్ నీల్‌తో చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే తన సన్నిహితులతో ప్రశాంత్ నీల్‌తో కూడా మాట్లాడించారట.. ప్రశాంత్ కూడా బన్నీతో సినిమా చేయడానికి ఓకే అన్నట్టు ఇప్పుడు ఒక వార్త బాలీవుడ్ లో వైరల్ గా మారింది.

అలాగే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ 2 తో పాటు ఎన్టీఆర్ 31వ‌ సినిమాను చేయబోతున్నాడు.. వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే సలార్ 2 షూటింగ్ కూడా త్వరలోనే మొదలు పెట్టనున్నాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌తో సినిమా 2025 చివర్ల ప్రారంభం కానుంది అని కూడా అంటున్నారు. బన్నీ కూడా పుష్ప సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.  ఇలా వరుస పాన్ ఇండియా దర్శకులతో సినిమాలు చేసి ఆ స్టార్ హీరోకు భారీ షాక్ ఇవ్వాలని అల్లు అర్జున్ డిస్టర్డ్ అయినట్టు తెలుస్తుంది. ఇక మరి ప్రశాంత్ నీల్‌ సినిమాపై బన్నీ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: