ఆ సినిమా డైలాగ్ వాడి.. చివరికి ఎలిమినేట్ అయిపోయిన మణికంఠ?

praveen
ఒక్కోసారి మనం చేసిన అతి మన కొంప ముంచుతుంది. బిగ్‌బాస్‌ సీజన్‌-8లో సరిగ్గా అదే జరిగింది. ప్రేక్షకులు ఇష్టపడి ఓటు వేసినా, హోస్ట్ నాగార్జున హెచ్చరించినా, నాగ మణికంఠ ఎలిమినేట్‌ అయ్యి, అందరికీ షాక్ ఇచ్చాడు. 'నాగార్జున గారూ ఎలిమినేట్‌ చేసేయండి సార్‌' అని దూకుడు సినిమాలో డైలాగ్ వాడుతూ నాగ మణికంఠ తనని ఎలిమినేట్‌ చేసేయమంటూ పదే పదే నాగార్జునని అడిగాడు. కట్ చేస్తే, ఈ వారం నామినేషన్స్‌లో మణికంఠ, గౌతమ్‌లు చివరి వరకూ నిలిచిన సంగతి విదితమే. ఈ క్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. ఇంటి నుంచి బయటకి వెళ్లిపోవాలనుకున్న మణికంఠ నిర్ణయంపై మరోసారి సమీక్షించుకోవాల్సిందిగా అవకాశం ఇచ్చారు.
ఇకపోతే, ఈ వారం ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన గౌతమ్‌ ఎలిమినేట్‌ కావాల్సి ఉండగా, మణికంఠ తనని తాను ఎలిమినేట్‌ చేయమని కోరడంతో అది కాస్త గౌతమ్‌ కి చాలా ప్లస్ అయింది. కట్ చేస్తే మణికంఠని ఇంటి నుంచి బయటకు పంపారు. అది చూసి బిగ్ బాస్ ఇంటి సభ్యులు, బుల్లితెర ఆడియన్స్ చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. 'తప్పు నిర్ణయం తీసుకున్నాడు', 'గౌతమ్‌ వెళ్లిపోయేవాడు.. అనవసరంగా కెలుక్కున్నాడు' అంటూ కామెంట్స్ చేసారున్నారు. అనంతరం వేదికపైకి వచ్చిన మణికంఠతో ఎందుకు సెల్ఫ్‌ ఎవిక్షన్‌ చేసుకున్నావు అని నాగార్జున అడగగా... ''ఎనర్జీ తగ్గిపోయింది. ఫన్‌ టాస్క్‌ వచ్చినప్పుడు ఆలోచిస్తున్నా. ఫిజికల్ టాస్క్‌కి వస్తే, చాలా ఒత్తిడికి లోనవుతున్నా. ఎక్కడో మునిగిపోయినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం చాలా రిలీఫ్‌గా ఉన్నా. నాకు ఓటు వేసిన వాళ్లందరికీ క్షమాపణ చెబుతున్నా!" అంటూ వెనుదిరిగాడు.
ఈ సందర్భంగా మణికంఠ ఇంకా మాట్లాడుతూ... "నా ఆరోగ్యమే నాకు ముఖ్యం అని అనిపించింది. లక్ష్మీ దేవి కంటే ఆరోగ్యం ముఖ్యం కదా. ఆరోగ్యం దెబ్బతింటే వచ్చిన లక్ష్మీదేవి కూడా నన్ను కనికరించదు. నేను ఇక్కడకు వచ్చినప్పుడు ఎవరికీ తెలియదు. బిగ్‌బాస్‌ వేదిక వలెనే నాకు మంచి పాపులారిటీ దక్కింది. ప్రేక్షకుల సహకారం వల్లే నేను ఇక్కడి దాకా వచ్చా. కానీ, నా ఆరోగ్యం నాకు ముఖ్యం. నాకు పునర్జన్మ లభించినట్టు అయింది!'' అని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: