బాలయ్య vs నాగార్జున .. అన్‏స్టాపబుల్ వేదికగా రచ్చ..!

Amruth kumar
నట‌సింహం నందమూరి బాలకృష్ణ  , అక్కినేని నాగార్జున ఇద్దరూ అన్నదమ్ముల లాంటి వారు.. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కల్లులా వెలుగుతున్న నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నట వారసులుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తండ్రులను మించిన నటులగా పేరు తెచ్చుకున్నారు. అలాగే తండ్ర‌లు చేయలేని పాత్రలు కూడా చేసి అద‌రహో అనిపించారు. అలాంటి ఇద్దరు హీరోలు మధ్య గత కొంతకాలం నుంచి కోల్డ్ వార్ నడుస్తుందని వార్తలు ఇప్పటికీ వస్తున్నాయి.

బాలకృష్ణ అంటే నాగార్జునకు అసలు నచ్చదని..  ఆయన పేరు చెప్తేనే పలు ఈవెంట్లు కూడా నాగార్జున క్యాన్సిల్ చేస్తారని కూడా అంటారు. బాలయ్య కూడా నాగార్జునపై ఇష్టం ఉన్న గతంలో ఆయన చేసిన పలు పనులు కారణంగా నాగార్జునకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. ఇదే సమయంలో నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయంలో బాలకృష్ణ దగ్గరుండి టాలీవుడ్కు పరిచయం చేసిన వైనం మనకు తెలిసిందే. అలాంటి వీరిద్దరూ గతంలో ఓ సినిమాలో కలిసి నటించాలని కూడా ప్రయత్నించారు. బాలకృష్ణ స్వయంగా నాగార్జునకు స్టోరీ కూడా చెప్పి సినిమా చేద్దామని కూడా అనుకున్నారు. ఇద్దరు ఓకే చెప్పినా ఆ సినిమా ముందుకు వెళ్ళలేదు.

అలాంటి ఈ ఇద్దరు ఎలా విడిపోయారు అనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎప్పుడు నాగార్జున - బాలయ్య హోస్టుగా చేస్తున్న అన్‏స్టాపబుల్  షోలో చివరి ఎపిసోడ్ కు గెస్ట్ గా వస్తున్నారని అంటున్నారు. నాగార్జున ఎపిసోడ్ తో ఈ సీజన్ ముగించాలని ఆహా ప్లాన్ చేస్తుందట. అయితే ఈ ఎపిసోడ్లో నాగార్జున - బాలకృష్ణ మధ్య ఆసక్తికరమైన డిబేట్ జరుగుతుందని అంటున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ - నాగార్జున ఎందుకు మాట్లాడుకోవటం లేదు .. అసలు వీరి మధ్య ఏం జరిగింది .. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ రాజకీయంగా అన్ని వివాదాలు ఇరుకుంటుంది. వాటిపై అలాగే నాగచైతన్య - సమంత విడాకులపై గురించి కూడా ఈ ఎపిసోడ్లో మాట్లాడబోతున్నారట....ముఖ్యంగా బాలకృష్ణ - నాగార్జున మధ్య జరుగుతున్న వార్‌కు ఈ ఎపిసోడ్ ఎండ్ కార్డ్ పెడుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: