పుష్ప 2 కోసం అలా చేశాం.. అజయ్ దేవగన్..?

Pulgam Srinivas
కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 1 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ కి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాని రూపొందిస్తున్నారు. ఇకపోతే కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 2 మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన చాలా పనులు ఆ తేదీ వరకు పెండింగ్ ఉండే ఉద్దేశంతో ఈ సినిమా విడుదల తేదీని పోస్ట్ పోన్ చేసి డిసెంబర్ 6 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇకపోతే హిందీ లో సింగం ఆగైన్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అజయ్ దేవగన్ , రన్వీర్ సింగ్ , టైగర్ షర్ఫ్ , కరీనా కపూర్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాను నవంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వరుస ఇంటర్వ్యూ లలో , టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా అజయ్ దేవగన్ ఓ ఇంటర్వ్యూ లో భాగంగా పుష్ప  పార్ట్ 2 గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశారు.

తాజాగా అజయ్ దేవగన్ మాట్లాడుతూ ... పుష్ప పార్ట్ 2 మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మేము కూడా సింగం అగైన్ మూవీ ని అదే తేదీన విడుదల చేయాలి అనుకున్నాం. కానీ పుష్ప పార్ట్ 2 సినిమాను ఆ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో మేము ఆ తేదీన కాకుండా వేరే తేదీన మా సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించాం అని అజయ్ దేవగన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ad

సంబంధిత వార్తలు: