గురూజీ .. జక్కన్న.. మొదలు పెట్టేదెప్పుడు.. బాక్సాఫీస్‌ను దున్నేది ఎప్పుడు..?

Amruth kumar
గురూజీ.. మీరు ఎక్కడ ఆపారు అక్కడ నుంచి.. నేను ప్రారంభిస్తాను అంటున్నారు దర్శకధీరుడు.. మరి నేనెక్కడ నుంచి మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ కనిపిస్తున్నాడు త్రివిక్రమ్. ప్రజెంట్ త్రివిక్రమ్‌ మరియు రాజమౌళి పరిస్థితిని ఇంతకన్నా ఎలా చెప్పగలమంటున్నారు సిని విశ్లేషకులు .. ఇంతకీ ఇద్దరు మనసులో ఏముంది? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

దర్శకధీరుడు రాజమౌళి మరియు త్రివిక్రమ్ ఈ సంవత్సరం అసలు సందడి చేయలేదా? అంటే ఎందుకు చేయలేదు గట్టిగానే చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ తో ఓ సినిమా చేశారు త్రివిక్రమ్ అని మహేష్ అభిమానులు గట్టిగా చెబుతారు. ధమ్‌ మసాలా బిర్యానీ  గుమగుమలు మర్చిపోకముందే, ఇంటర్నేషనల్ వంట కాలనీ జక్కన్న వడ్డిస్తారని ఎదురుచూపులు మహేష్ అభిమానుల్లో ఉన్నాయి.. వారి కనీసం వచ్చే ఆడాదైనా ప్రకటన ఉంటుందా అనే దాకా తెచ్చారు. త్రిబుల్ ఆర్ తర్వాత పక్క అనౌన్స్మెంట్ కోసం జనాలు ఎదురు చూస్తున్న విషయం రాజమౌళికి కూడా తెలుసు. తొందరపడి ఏదో ఒక విషయం చెప్పడం కన్నా నిలిచి నిదానంగా పక్కాగా ప్లానింగ్ గా చేయాలన్నది ఆయన ఉద్దేశం.

అలాగే గుంటూరు కారం తర్వాత స్క్రిప్టు పనులలో బిజీగా ఉన్నారు త్రివిక్రమ్.. తన తర్వాత సినిమాను ఎవరితో చేస్తారు అన్నది రాబోయే కొత్త సంవత్సరంలో ప్రకటిస్తారని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే అల్లు అర్జున్ కోసం అదిరిపోయే కథను రెడీ చేశారని టాక్‌ కూడా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ కోసం రెండు ప్రాజెక్టులను సిద్ధం చేశారని మాట కూడా వినిపిస్తుంది. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ తోనే సినిమా ఉంటుందని న్యూస్ బయటికి వచ్చింది. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ముందుగా త్రివిక్రమ్ తోనే సినిమా మొదలు పెడతారని టాక్‌ కూడా నడిచింది. ఇలా వీరులో ఎవరితో త్రివిక్రమ్ మూవీ చేస్తారు, రాజమౌళి తన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది.. టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: