ఆ టాక్ షో లో డార్లింగ్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!

Anilkumar
ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో ఈయన ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఈ స్టార్ హీరో  ది రాజా సబ్ అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో "ఫౌజీ" అనే సినిమాలో నటించబోతున్నాడు. ఇక ఇది కాసేపు పక్కన పెడితే ప్రభాస్ తాజాగా ఒక టాక్ షోలో  కనిపించి అభిమానులను ఉత్సాహంగా నిలిపారు. 

ఎక్కువగా సినిమాలపైనే దృష్టి పెట్టే ప్రభాస్ ఇలా టాక్ షోలకు రావడం చాలా అరుదు. ఈ వార్త తెలిసిన ఆయన అభిమానులు ఉబలాటపడుతున్నారు. కాగా ప్రభాస్ తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గొప్పతనాన్ని తెలియజేసే లక్ష్యంతో రూపొందిస్తున్నారు. ప్రభాస్ కూడా సిరివెన్నెల గారి గురించి ఎంతో గౌరవంగా మాట్లాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 

ఇక ఈ షో కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు తాజాగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా "నీ ఉచ్ఛ్వాసం కవనం" లేటెస్ట్ ఎపిసోడ్ ఈ ఆదివారం ఉదయం 9 గంటలకు టెలికాస్ట్ చేయనున్నారు. ప్రభాస్ ఈ షోలో కనిపించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ఈ వార్తను తెలియజేస్తూ ఎన్నో రకాల కామెంట్లు చేస్తున్నారు. ఆయనను ప్రశంసించడంతో పాటు, ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలియజేస్తున్నారు. ఇకపోతే ఆగస్టు 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ అంతా తన బర్త్ డే ను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: