షాక్:టాలీవుడ్ లో సంచలనం.. పెళ్లయి 21 ఏళ్లకు విడాకులు..!

Divya
కొంతమంది సినీ సెలబ్రిటీలు ప్రేమించుకొని వివాహం చేసుకున్న వారి బంధం మూన్నాళ్ళ ముచ్చటగానే మారిపోయింది. అయితే మరి కొంతమంది మాత్రం కొన్ని దశాబ్దాలుగా కలిసి ఉన్నప్పటికీ కొన్ని కారణాల చేత విడిపోతున్నారు. ఇప్పుడు తాజాగా వీరి లిస్టులోకి అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ కూడా చేరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అందుకు  సంబంధించి ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడంతో ఇండస్ట్రీలో కూడా తెగ వైరల్ గా మారుతోంది. డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి మరి వివాహం చేసుకుంది రమ్యకృష్ణ.

1990లో రమ్యకృష్ణ స్టార్ డమ్ సంపాదించుకుంది.తన అందంతోపాటు నటనతో తెలుగు తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది రమ్యకృష్ణ. 2003లో డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి మరి వివాహం చేసుకున్న రమ్యకృష్ణకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా అటు కృష్ణవంశీ,రమ్యకృష్ణ మధ్య విభేదాలు వచ్చాయని అందుకే దూరంగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ విషయం పైన డైరెక్టర్ కృష్ణవంశీ స్పందిస్తూ ఒక సినిమా షూటింగ్ కోసం తాను హైదరాబాదులోనే ఉండాల్సి వచ్చింది తన భార్య చెన్నైలో ఉన్నదని దీంతో తాము విడివిడిగా జీవిస్తున్నామని చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా ఒకరి కుటుంబం గురించి ప్రచారం చేయడం చాలా శాడిస్ట్ తనం అంటూ తెలిపారు. అయితే అటు కృష్ణవంశీ ఈ విషయం పైన స్పందించిన రమ్యకృష్ణ మాత్రం ఎప్పుడు ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు. 40 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికి పలు చిత్రాలలో పలు రకాల పాత్రలలో నటిస్తున్న రమ్యకృష్ణ ఇప్పటికి బిజీగానే గడిపేస్తోంది. సుమారుగా ఇప్పటికే రెండు వందలకు పైగా చిత్రాలలో నటించిన రమ్యకృష్ణ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నది. హీరోయిన్ గానే కాకుండా లేడీ విలన్ గా అద్భుతమైన పాత్రలలో నటించింది రమ్యకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: