జాన్వీ కపూర్ కారణంగా మృణాల్ ఠాకూర్ కు అంత అన్యాయం జరిగిందా.. ఆమె ఏమనిందంటే..!

Amruth kumar

పాన్ ఇండియా స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్  రీసెంట్గా బాలీవుడ్లో నెపోటిజం గురించి తన అనుభవాల ను పంచుకుంది .. ముఖ్యంగా మీడియా స్టార్ కిడ్స్ ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతూ .. ఒక అవార్డు ఫంక్షన్ లో తనకి జరిగిన ఘోర అవమానం గురించి ఆమె చెప్పుకు వచ్చింది. 2019 లో జరిగిన జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులు ఇచ్చినప్పుడు .. ఆ సమయంలో మృణాల్ ఠాకుర్ , జాన్వి కపూర్ ఇద్దరూ వేరు వేరు విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నారు .. మృణాల్ ఠాకూర్  ' బెస్ట్ క్రిటిక్స్ యాక్ట్రెస్ '  అవార్డు ను గెలుచుకుంది .

 
ఆ సమయంలో మృణాల్ ను ఇంటర్వ్యూ చేస్తున్న కొందరు మీడియా సభ్యులు . నా ఇంటర్వ్యూ స‌గం లో ఉన్నాను ఆ సమయం లో మరో స్టార్ కిడ్ రాగానే .. అందరూ నన్ను మధ్య లో వదిలేసి ఆమె వెంట వెళ్ళిపోయారు .. నాకు బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ అవార్డు వచ్చింది . అలాగే జాన్వి కి కూడా అలాగే అవార్డు వచ్చింది అంటూ తనకు జరిగిన అనుభవాన్ని అందరి తో పంచుకుంది మృణాల్ ఠాకూర్ .

అయితే ఆమె నెపోటిజం గురించి మాట్లాడుతూ ఇది వారి తప్పు కాదు స్టార్ కిడ్స్ కానీ మనం సాధారణ ప్రజలు గా వారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో ఆసక్తి చూపిస్తాం .. ఇది ప్రేక్షకులు తీసుకొని నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది . తెలుగు లో ఆమె నటించిన సీతా రామం, హాయ్ నాన్న సినిమాల‌ కు మంచి ఆదరణ లభించింది . ఆమె విజయ్ దేవరకొండ సరసన నటించిన ' ఫ్యామిలీ స్టార్ ' మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని సాధించలేదు . కల్కి 2894 లో కూడా చిన్న పాత్రలో కనిపించిన మృణాల్ మరికొన్ని సినిమాల‌తో బిజీగా ఉంది  .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: