పిల్లల విషయంలో గొడవలు.. భర్తకి రంభ విడాకులు..ఫ్యామిలీ కోర్టు లో కేసు.?

Pandrala Sravanthi
90's లో యూత్ ని ఉర్రూతలూగించిన హీరోయిన్లలో నటి రంభ ఒకరు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మరాఠీ, భోజ్పురి, కన్నడ,తమిళ ఎన్నో భాషల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.అయితే పెళ్లి అయ్యాక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో కనెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ శ్రీలంకలో సెటిల్ అయినటువంటి తమిళ బిజినెస్ మాన్ ఇంద్ర కుమార్ పద్మనాభని పెళ్లి చేసుకొని కెనడాలో సెటిల్ అయిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ కి ఇద్దరు కూతుర్లతో పాటు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇక రంభ కూతుర్లు కూడా తల్లికి ఏ మాత్రం మించని అందంతో ఉన్నారు. ఒకవేళ వీరిని సినీ ఇండస్ట్రీకి తీసుకువస్తే రంభ లాగే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు అవ్వడం ఖాయం అని వీరి ఫోటోలు చూసిన నెటిజన్స్ కామెంట్లు పెడుతూ ఉంటారు. అయితే అలాంటి రంభ గురించి ఒక షాకింగ్ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే.. పిల్లల విషయంలో భర్తతో గొడవలు పడి రంభ భర్తకు విడాకులు ఇవ్వబోతుంది అంటూ ఓ వార్త మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వార్త ఇప్పుడు వైరల్ అయిందైతే కాదు. చాలా రోజుల నుండి ఈ వార్త వినిపిస్తోంది. అయితే ఈ వార్తపై ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రంభ మాట్లాడుతూ..మా విడాకుల వార్తలు రావడం అనేది చాలా అవాస్తవం.అందులో నిజం లేదు. చాలామంది వారి ఆనందం కోసం ఈ వార్తలు రాస్తారు.కానీ ఆ వార్తలకు మా మనసు ఎంత బాధ పడుతుందో గ్రహించరు. ఇక ఈ విడాకుల వార్తలు రావడానికి ఓ కారణం ఉంది.

అదేంటంటే మేమిద్దరం అందరిలాగే చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడ్డాం.అలా పిల్లల విషయంలో మా ఇద్దరికీ గొడవ వచ్చింది.నేనేమో పిల్లల్ని ఇండియాలో పెంచుదాం అంటే మా ఆయనేమో సౌత్ అమెరికాలో పెంచుదామన్నారు.కానీ నాకేమో నా పిల్లలు భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకోవాలనే కోరిక ఉంది. కానీ మా ఆయన వాళ్లు నా పిల్లలు నేను చెప్పిన దగ్గరే పెరగాలి అని అన్నారు. ఈ విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. కానీ ఈ గొడవకే విడాకులు అంటూ పెద్ద పెద్ద వార్తలు రాశారు అంటూ క్లారిటీ ఇచ్చింది.ఇక గతంలో రంభ తన భర్తతో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో కేసు వేసిందని, కానీ ఈ విషయంలో రాఘవేందర్రావు కల్పించుకొని వీరిద్దరికి సర్ది చెప్పారనే రూమర్ కూడా వినిపించింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: