బోయపాటిని భయపడుతున్న ఆ ముగ్గురు.. అఖండ 2 కి గట్టి టార్గెట్ ఏ పెట్టారుగా..!

Amruth kumar
నట‌సింహం బాలకృష్ణతో సింహ , లెజెండ్ , అఖండ వంటి హాట్రిక్ విజయాలు ఇచ్చిన బోయపాటి ఇప్పుడు భయపడుతున్నాడా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అసలు విషయంలోకి వెళితే వీరిద్దరి కాంబినేషన్లో నాలుగో సినిమాగా అఖండ 2 రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు చేసుకుంది .. ఈ ఇద్దరి కాంబోలో మూవీ అంటే హిట్ గ్యారెంటీ అని టాలీవుడ్ లో ఓ ముద్ర పడిపోయింది. అలాంటిది డైరెక్టర్ ఎందుకు భయపడాల్సి వస్తుంది ? అయితే మరో ఇద్దరు దర్శకులను చూసి బోయపాటి ఖంగు తినాల్సి వస్తుందనే చర్చ సోష‌ల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది . బోయపాటిని భయపడుతున్న ఆ ఇద్దరు దర్శకులు ఎవరు? అనే విషయాలు ఇక్కడ చూద్దాం.

నిజానికి బాలయ్య - బోయపాటి కాంబో అంటేనే అంచనాలు మామూలుగా ఉండవు .. ఎందుకంటే అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలా బాలయ్యను ఊహించని రేంజ్ లో చూపించి మరి బాల‌య్య‌కు  బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి అభిమానులకు ఫేవరెట్ డైరెక్టర్గా మారిపోయాడు. సింహా , లెజెండ్ అఖండల పరంపర తర్వాత రీసెంట్ గానే అఖండ 2 ను మొదలు పెట్టాడు. అయితే అఖండ తర్వాత వీర సింహారెడ్డి ... విడుదలైంది ఈ సినిమా చూశాక బోయపాటి డైరెక్ట్ చేశాడనేలా బాలయ్యను చూపించడు గోపీచంద్ మలినేనీ  ఈ సినిమా మొత్తం బాలయ్యకు ఓ లెవెల్లో ఎలివేషన్ ఇచ్చాడు. గోపీచంద్..

ఇక వీర సింహారెడ్డి తర్వాత అదే రేంజ్ లో బాబీ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్నాడు. బాలయ్యను బోయపాటి కంటే బాబి బాగా చూపించారని సినిమా నిర్మాత నాగవంశీ కూడా కామెంట్ చేశారు . ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఒకరకంగా చెప్పాలంటే బోయపాటి శ్రీను టార్గెట్ ను గోపీచంద్ , బాబీ ఇద్దరూ పెంచేసినట్టు చెబుతున్నారు . విశ్లేషకులు ఎందుకంటే ఇప్పుడు అఖండని మించి అఖండ 2 ఉండేలా చేయడం మాత్రమే కాదు అటు వీరిసింహారెడ్డి ఇటు బాలయ్య 109వ‌ సినిమాను మించేలా ప్లాన్ చేసుకోక తప్పదని అంటున్నారు. ఇక బాల‌య్య‌ను బోయపాటి ఏ విధంగా చూపిస్తాడో ... ప్రేక్షకులను అభిమానులు ఎలా మప్పిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: