పవన్ - ఎన్టీఆర్‌కు షాక్ ఇచ్చిన స్టార్ హీరోలు.. టాలీవుడ్ లోనే ఊహించిని మైండ్ గేమ్ మొదలైందిగా..!

Amruth kumar
మన తెలుగు చిత్ర పరిశ్రమలో హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న టాప్ 2 హీరోల లిస్టు తీస్తే అందరికీ గుర్తుకొచ్చే పేర్లు ఎన్టీఆర్ - పవన్ కళ్యాణ్.. మన తెలుగు రాష్ట్రాల్లో వీరిద్దరికి ఉన్న క్రేజ్ ఫాలోయింగ్ ఎవరికి లేదు.. అనటంలో ఎలాంటి సందేహం లేదు . అయితే ఇప్పుడు వీరిద్దరికీ దక్కని ఓ అరుదైన గౌరవం మిగిలిన స్టార్ హీరోలు అందరికీ దక్కింది. అయితే ఇప్పుడు ఇద్దరు హీరోల అభిమానులకు భారీ నిరాశగా మిగిలింది. అసలు మ్యాటర్లోకి వెళితే.. సింగపూర్ లో ఉండే తుస్సాద్స్ మ్యూజియం లో మన టాలీవుడ్ హీరోలకు సంబంధించిన మైనపు బొమ్మలు ప్రతిష్టించిన విషయం తెలిసిందే. అందరికంటే ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పట్లో ఈ వార్త ఒక సెన్సేషన్ గా మారింది.

ఎవరికీ రాని ఈ అదృష్టం మా అభిమాన హీరోకి దక్కిందంటూ మహేష్ అభిమానులు సంబరపడిపోయాడు. మహేష్ తర్వాత  రెబల్ స్టార్ ప్రభాస్ కి సంబంధించిన మైనపు బొమ్మని అక్కడ ప్రతిష్టించారు. ఆ తర్వాత సంవత్సరం అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టారు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌  విగ్రహాన్ని కూడా త్వరలోనే అక్కడ పెట్టబోతున్నారని తెలుస్తుంది. అలాగే రామ్ చరణ్ తన పెంపుడు కుక్క రైమ్ని తన చేతిలో పెట్టుకుని స్టైలిష్ గా కూర్చున్నట్టుగా ఆ విగ్రహం ఉంటుందని మ్యూజియం అధికారులు కూడా కొలతలు తీసుకుని వెళ్లారు.

ఇలా టాలీవుడ్‌లో 6రు స్టార్ హీరోలు ఉంటే అందులో నలుగురు విగ్రహాలు అక్కడ ప్రతిష్టింపబడ్డాయి. ఒక్క పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్ వి తప్ప.. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయలేదు కాబట్టి ఆయన విగ్రహం అక్కడ పెట్టకపోవటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరూ త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ కంటే ముందు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని పెట్టారంటే ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కి గ్లోబల్ స్థాయిలో ఎక్కువ క్రేజ్ ఉందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేతిలో ‘ఓజీ’, ‘హరి హర వీరమల్లు’ వంటి పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా అయినా పాన్ ఇండియా లెవెల్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొడితే ఆయన మైనపు విగ్రహాన్ని కూడా అక్క‌డ‌ ప్రతిష్టించే అవ‌కాశం ఉంది. ఇక ఎన్టీఆర్ కి కూడా అతి త్వరలోనే ఈ గౌరవం రానుంది అన్ని అంటూన్న‌రు. ఇక చూడాలి మరి ఏమి జరగబోతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: