రాజా సాబ్ కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా..?

Pulgam Srinivas
ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న తెలుగు హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ఇకపోతే ఈయన ఈ మధ్య కాలంలో వరుస పెట్టి పాన్ ఇండియా మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఆఖరుగా ప్రభాస్ , నగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ , మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ ,  రీద్దీ కుమార్ లు ఈ సినిమాలో హీరోయిన్లుగా కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. నిన్న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ప్రభాస్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే రాజా సాబ్ సినిమా కోసం ప్రభాస్ చాలా తక్కువ మొత్తంలో పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

దాదాపు సినిమాకు 150 కోట్ల వరకు పారితోషకాన్ని తీసుకునే ప్రభాస్ "రాజా సాబ్" సినిమా కోసం మాత్రం కేవలం 100 కోట్ల పారితోషకాన్ని మాత్రమే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం తెలుగు రాష్ట్రాల హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిన టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీ ద్వారా భారీగా నష్టపోవడంతో ఆయన బ్యానర్లో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ కి తక్కువ మొత్తంలో ప్రభాస్ పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: