రంగస్థలం కి ముందు చరణ్.. సమంత కాంబోలో అన్ని సినిమాలు మిస్ అయ్యాయా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా కొన్ని సంవత్సరాల క్రితం రంగస్థలం అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే భారీ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలోని రామ్ చరణ్ , సమంత నటనలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ సినిమాలో వీరిద్దరి జోడి కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే రంగస్థలం మూవీ కంటే ముందే రామ్ చరణ్ , సమంత కాంబోలో రెండు సినిమాలు మిస్ అయినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలు ఏవి ..? ఎందుకు మిస్ అయ్యాయి అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం రామ్ చరణ్ "ఎవడు" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్ , అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో శృతి హాసన్ పాత్ర కోసం మొదట సమంత ను అనుకున్నారట. కానీ ఈమె ఆ సమయంలో చాలా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. దానితో శృతి హాసన్ ను ఈ మూవీ బృందం హీరోయిన్గా సెలెక్ట్ చేసుకుందట. ఇకపోతే రామ్ చరణ్ కొత్త కాలం క్రితం బ్రూస్ లీ అనే సినిమాలో హీరోగా నటించాడు. 

ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో హీరోయిన్గా మొదట సమంత ను అనుకున్నారట. కానీ ఈమె ఆ సమయంలో కూడా చాలా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. దానితో రకుల్ ను ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో హీరోయిన్గా ఎంచుకుందట. ఇలా రంగస్థలం కంటే ముందే ఎవడు , బ్రూస్ లీ సినిమాల్లో రామ్ చరణ్ తో నటించే అవకాశం వచ్చిన సమంత ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా ఆఫర్లను రిజెక్ట్ చేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: