మహేష్ జక్కన్న ఫ్యాన్స్ కు స్వీట్ న్యూస్.. 40 శాతం వర్క్ ఇప్పటికే పూర్తైందా?

Reddy P Rajasekhar
మహేష్ రాజమౌళి కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యం కావడం అభిమానుల్లో ఒకింత అసంతృప్తిని కలిగిస్తోంది. జక్కన్న గతంలో ఏ సినిమా కోసం ఇంత సమయం కేటాయించలేదనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అయితే మహేష్ జక్కన్న ఫ్యాన్స్ ను మెప్పించే స్వీట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని సమాచారం.
 
ప్రముఖ హాలీవుడ్ సంస్థలు విజువల్ ఎఫెక్ట్స్ పనుల కోసం పని చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. జక్కన్న ఈ సినిమా కోసం రివర్స్ ప్రాసెస్ లో అడుగులు వేస్తున్నారని భోగట్టా. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన హాలీవుడ్ సంస్థలు ఈ సినిమాలో భాగం కానున్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. 40 శాతం వర్క్ ఇప్పటికే పూర్తైందనే వార్త మహేష్ బాబు అభిమానులకు పండగ లాంటి వార్త అనే చెప్పాలి.
 
మరోవైపు మహేష్ బాబు ఎంతోమంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించడం ద్వారా వార్తల్లో నిలవడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. మహేష్ బాబు సైతం సినిమా సినిమాకు ఇకపై లుక్స్ విషయంలో వేరియేషన్ చూపించనున్నారని తెలుస్తోంది. మహేష్ తన సినిమాల కోసం ఎంతో కష్టపడుతున్నారు.
 
రాజమౌళి సినిమాతో మహేష్ బాబు పాన్ వరల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తుండగా ఈ సినిమా 3000 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకునే సినిమా అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ జక్కన్న కాంబో భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జక్కన్న ఈ సినిమా కోసం పడుతున్న కష్టాన్ని నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. మహేష్ జక్కన్న కాంబో మూవీ 50కు పైగా భాషల్లో విడుదల కానుందని సమాచారం అందుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: