బాలయ్య ని ముద్దుగా వసుంధర అలా పిలుస్తుందా..? హౌ రొమాంటిక్..!

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది జంటలు ఉన్నారు. కానీ  బాలయ్య వసుంధర అంటే అందరికి ఇష్టం. వీళ్ల గురించి అందరు ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు . దానికి కారణం కూడా మనకు తెలిసిందే. చాలా లవబుల్ ట్రెడిషనల్ కపుల్స్ గా ఉంటారు. ఒకరిని ఒకరు ప్రేమిస్తూ ..అదే విధంగా ఇష్టపడుతూ ..అలాగే రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. మనం చూస్తున్నాం ఈ మధ్య కపుల్స్ ఎలా చిన్న చిన్న విషయాలకే గొడవ పడి విడాకులు తీసుకుంటున్నారో.


అయితే బాలయ్య షూటింగ్లో బిజీగా ఉన్న బాలయ్య ఇంట్లో పరిస్థితిని పట్టించుకోలేని  పొజిషన్లో ఉన్న కూడా వసుంధర దేవి ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకులను చేసింది. అందుకే బాలయ్య ప్రతి ఈవెంట్ లో చెప్తూ ఉంటారు.." నేను ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం ఒకటి మా నాన్న అయితే మరొక రీజన్ వసుంధర దేవి అని. వసుంధర ఇంట్లో పిల్లలను చూసుకోవడం కారణంగానే నేను ఇలా ఈ స్టార్ స్టేటస్ అందుకున్నాను అని చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు ".


కాగా బాలయ్య ని చూడగానే అందరికీ భయం భయంగా ఉంటుంది . ఆయన కోపాన్ని చూసి భలే భయపడిపోతూ ఉంటారు జనాలు. అయితే అటువంటి బాలయ్యను వసుంధర దేవి ఎలా హ్యాండిల్ చేస్తుంది అని అందరికీ డౌట్ ఉండనే ఉంటుంది . అయితే బాలయ్య ఎంత కోపంగా బిహేవ్ చేస్తాడో అంత మంచి మనిషి కూడా . అది ఆయనను దగ్గర నుంచి గమనించే వాళ్లకు మాత్రమే తెలుసు . కాగా  బాలయ్యను వసుంధర దేవి ముద్దుగా ఏమని పిలుస్తుంది అంటూ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు . అయితే దానికి ఆమె ఆన్సర్ చెప్పడానికి నిరాకరించింది . కానీ ఫైనల్లీ ఆన్సర్ బయటపడింది. " శ్రీవారు " అంటూ ముద్దుగా బాలయ్యను పిలుస్తారట. కన్నయ్య,బేబీ, డార్లింగ్ అంటూ రకరకాల పేర్లతో పిలుచుకునే టైం లోను..వసుంధర శ్రీవారు అంటూ పద్ధతిగా భర్తని పిలవడానికి ఇష్టపడడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు జనాలు. మరి కొందరు ఇదే ప్రేమంటే అంటూ ఓ రేంజ్ లో బాలయ్య - వసుంధర ని పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: