మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్.. రాజకీయాలపై ఒక్క మాటతో తేల్చేసాడుగా..!

Amruth kumar
మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ తర్వాత వచ్చిన హీరోలలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు . తన నటన తో చిన్నమామ పవన్ కళ్యాణ్ ని గుర్తు చేస్తూ మెగా అభిమానులకు దగ్గరయ్యాడు . ప్రస్తుతం టాలీవుడ్ లోనే మినిమం హీరోగా దూసుకుపోతున్నడు సాయి ధరమ్ తేజ్ ... గతంలో యాక్సిడెంట్ కి గురికావడం వారం రోజులకు పైగా కోమలో ఉండటం ఇలా ఆయన లైఫ్ లో ఊహించని ఘటన జరిగింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల్లో రియంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా ఏబీపీ నిర్వహిస్తున్న సదరన్ రైసింగ్ సమిట్ 2024 లో ఆయన పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ముఖ్యంగా రాజాకీయాల‌ పై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు .. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతు ప్రస్తుత రోజుల్లో రాజకీయాలల్లో అడుగు పెట్టాలంటే ఎన్నో విషయాలు పై అవగాహన ఉండాలి . ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం నా సినిమాల పైనే ఉంది . ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో న‌టించి ప్రేక్షకుల ను అలరించాల ని భావిస్తున్నా . రాజకీయాల్లో కి రావాలనే ఆలోచన ప్రస్తుతాని కి నాకు లేదు . పాలిటిక్స్లోకి వెళ్లాలంటే ఎన్నో విషయాలు నేర్చుకోవాలి ప్రజా సమస్యల పై అవగాహన ఉండాలి అని సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు .

తనకి ఇది పునర్జన్మ అని కూడా అన్నాడు .. అలాగే తన య‌క్సిడెంట్ రోజుల్లోను గుర్తు చేసుకున్నాడు . ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అది అందరి ప్రాణాలను కాపాడుతుందని చెప్పుకొచ్చాడు . ఆయన సినిమాల విషయాని కొస్తే ప్రస్తుతం తన కెరియర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు సాయిధరమ్ తేజ్‌.. అయ‌న‌ నటించిన విరూపాక్ష , బ్రో సినిమాలు గత సంవత్సరం ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం రోహిత్ కేపీ దర్శకత్వంలో ఓ భారీ సినిమాలో నటిస్తున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: