పుష్ప దెబ్బకి బాలీవుడ్ వణికిపోతుందా....?

Anilkumar
తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసుకున్నారు ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్. తన నటన, డ్యాన్స్‌ తో అభిమానుల మనసులు దోచుకున్న ఆయన 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, బాలీవుడ్‌ లో కూడా అలలొలికించింది. ఇక దాని తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కబోతున్న విషయం అందరికీ తెలిసిందే.  సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్గా నటిస్తుండగా అనసూయ భరద్వాజ్, జగదీష్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ఇందుకూరి సునీల్ వర్మ, పలువురు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

 ఇప్పటికే ఇందులో నుంచి విడుదలైన పాటలు, గ్లీప్స్, ట్రైలర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుకుమార్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా అల్లు అర్జున్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ మూవీ ను డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా మేకర్స్ అంత గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి పోటీగా వేరే సినిమా రాకుండా ఉండేందుకు మేకర్స్ అంతా చాలా జాగ్రత్త వహిస్తున్నారు.

పుష్ప రాజ్ మేనియా ముందు తమ సినిమా కొట్టుకుపోతే ఫలితం ఉండదని చాలామంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రెస్టేజ్ చిత్రం ఛావా ప్రమోషన్స్ లో ఏం మాత్రం ముందుకు సాగట్లేదు. కాగా ఈ సినిమాని కూడా డిసెంబర్ 6 న మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే నార్త్ లో పుష్ప 2 చిత్రానికి ఉన్న క్రేజ్ దృశ్ట్యా ఈ సినిమాని వాయిదా వేస్తారని టాప్ బి టౌన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిజంగానే పుష్ప2 మూవీ కారణంగా బాలీవుడ్ సినిమాలో ఛావా వాయిదా పడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: