హమ్మయ్య... నా కల నెరవేరిందంటూ ఆసక్తికర పోస్ట్ చేసిన రేణుదేశాయ్..!

FARMANULLA SHAIK
టాలీవుడ్ ప్రముఖ నటి రేణు దేశాయ్ ఈ మధ్యన సామాజిక సేవా కార్యక్రమాల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మూగ జీవాలు, అనాథ పిల్లలకు తన వంతూ సాయం చేస్తున్నారు. అదే సమయంలో తన ఫాలోవర్స్‌ని కూడా విరాళం ఇవ్వామని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే రేణు దేశాయ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. ఈ రోజు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. నా సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఈ వీడియోను షేర్ చేస్తున్నాను. నేను ఎన్నో ఏళ్ల నుంచి ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. చిన్నతనం నుంచి మూగ జీవాలను సంరక్షించడం నాకు ఇష్టం. ఎన్నో సార్లు నా వంతు ప్రయత్నం చేశాను. మూగ జీవాల కోసం నా గళాన్ని వినిపించాలని, వాటి రక్షణ కోసం ఇంకా ఏదైనా మంచి పనులు చేయాలని కొవిడ్ సమయంలో గట్టిగా అనుకున్నాను. ఈ మేరకు ప్రయత్నాలు కూడా ప్రారంభించాను. ఇన్నాళ్లకు నా సొంత ఎన్జీవోను రిజిస్టర్ చేయించాను. ఇందుకోసం అన్నీ నా ప్యాకెట్ ‌లోంచే ఖర్చు పెడతాను. నా సొంతంగా అంబులెన్స్, బ్యాంక్ అకౌంట్‌ను సంపాదించాను. నన్ను నమ్మి నా కొత్త జర్నీకి అందరూ సపోర్ట్ చేయండి. ఇది నా కూతురు పేరు మీదగా  శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ అని ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేశాను. పేజ్‌ను ఫాలో అవండి. అయితే అందరికీ నేనొక రిక్వెస్ట్ చేస్తున్నాను. రూ. 500 అయినా సరే డొనేట్ చేయండి. నెలకు కనీసం రూ. 100 అయిన విరాళం ఇవ్వండి అది నాకు పెద్ద సహాయం. మీరు ఇచ్చిన డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా ఎక్కడికి పోదు. నేను నా సొంత డబ్బుతో హాస్పిటల్ కట్టిస్తాను. కానీ కొంత సమయం పడుతుంది అని చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొందరు కంగ్రాట్స్ చెబుతుంటే మరికొందరు డబ్బులు లేవని ఇన్నాళ్లు విరాళాలు అడిగి ఇప్పుడు ఎన్జీవో స్టార్ట్ చేయడం ఏంటని షాక్ అవుతున్నారు.ఇక రేణు దేశాయ్ పలు ఎన్జీవోలను నడుపుతున్నారు. తద్వారా జంతువులతో పాటు, అనాథ ఆశ్రమాలకు సైతం ఆమె సాయం చేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: