వార్నీ..కోడలు పిల్ల శోభిత మామ నాగార్జునను అలా పిలుస్తుందా ..? పూర్తిగా వరుసలు మార్చేసారుగా..!

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో పిల్లలకు ఇదొక బాగా ట్రెండ్ గా మారిపోయింది . అమ్మానాన్న తప్పిస్తే మిగతా వాళ్లను ఆంటీ అంకుల్ అంటూ పిలుస్తూ ఇంగ్లీష్ సాంప్రదాయాని  ఫాలో అవుతున్నారు . మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మన హిందూ పద్ధతుల ప్రకారం వావివరసలతో పిన్నమ్మ -బాబాయ్- పెదనాన్న - పెద్దమ్మ - అక్క బావ  ఇలా పిలుచుకుంటూ ఉంటారు.  కానీ ఇంగ్లీష్ వాళ్ళు మాత్రం అలా కాదు అమ్మానాన్నలు తప్పిస్తే మిగతా అందరిని ఆంటీ అంకుల్ అంటూ పిలుచుకుంటూ ఉంటారు.


అయితే అదే పద్ధతిని చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉండటం మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం.  కాగా రీసెంట్గా శోభిత ధూళిపాళ్ల కూడా ఆ కారణంగానే సోషల్ మీడియాలో హ్యూజ్   ట్రోలింగ్  కూడా ఎదురుకుంటుంది. మనకు తెలిసిందే హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలుగా మారిపోతుంది. అక్కినేని నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకోబోతుంది. త్వరలోనే వీళ్ల పెళ్లి ఘనంగా అంగరంగ వైభవంగా జరగబోతుంది .


ఇప్పుడే వీళ్ళ పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభించారు. డిసెంబర్ 4వ తేదీ వీళ్ల పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇదే క్రమంలో పెళ్లి తర్వాత నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల ముంబైలో సెటిల్ కాబోతున్నారు అంటూ కూడా వార్తలు ట్రెండ్ అవుతున్నాయి . కాగా నాగచైతన్య భార్యగా మారిపోతున్న శోభిత ..నాగచైతన్య తండ్రి అయిన నాగార్జునను పద్ధతి ప్రకారం మామ అంటూ మామగారు అంటూ పిలవాలి .


అయితే ఇంగ్లీష్ ట్రెండ్ బాగా ఫాలో అయ్యే శోభిత మాత్రం నాగార్జునను అంకుల్ అంకుల్ అంటూ పిలుస్తుందట . ఇది అక్కినేని ఫ్యాన్స్ కే కాదు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇబ్బందికరంగా ఉంది . అంతకు ముందు మాజీ కోడలు సమంత మాత్రం నాగార్జునను మామా మామ అంటూ బాగా ట్రెడిషనల్ గా పిలిచేదట. శోభిత  మాత్రం అంకుల్ అంటూ పిలవడంతో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ కి అదేవిధంగా కుటుంబ సభ్యులు డిసప్పాయింట్ అవుతున్నారు. కోడలు పిల్ల ఈ రేంజ్ లో మారిపోయింది ఏంటి ..? అంటూ ఇంగ్లీష్ కోడలు పిల్ల అంటూ సరికొత్తగా శోభిత  ధూళిపాళ్లను ట్రోల్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: