"దేవుడు ఉన్నాడు..ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్న"..ఎన్టీఆర్ సెన్సేషనల్ కామెంట్స్..!

Thota Jaya Madhuri
జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక పేరు మాత్రమే కాదు ..అది ఒక బ్రాండ్ . ఆయనను ఎంతమంది ఆదర్శంగా తీసుకొని ..ఆయన ఎలా బిహేవ్ చేస్తాడో.. ఆయన ఏం చేస్తాడు..? ఏం తింటాడు..? ఎలా ప్రవర్తిస్తాడు..? అని ఆయనను ఒక రోల్ మోడల్ గా తీసుకొని అదే విధంగా ఫాలో అయ్యే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ని ఒక హీరోలా కాకుండా తమ ఇంటి పెద్ద దిక్కుల భావించే జనాలు మనలో చాలామంది కూడా ఉండుంటారు.


అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ మరొకసారి నెట్టింట వైరల్ గా మారాయి.  దేవర సినిమాతో రీసెంట్గా అభిమానులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే దేవర 2 ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . ప్రజెంట్ వార్ 2 సినిమా షూట్ లో  బిజీగా ఉన్న తారక్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ ఫైకి తీసుకోరాబోతున్నాడు . ఇలా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీలతో దూసుకెళ్తున్న తారక్..తన కెరీర్ లో నటించిన  ఏ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుంది అన్న ప్రశ్న ఎదురవ్వగా "ఆది" అంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు.


"ఆది" సినిమా తనకు చాలా చాలా ఇష్టమని.. తన కెరీయర్ని మలుపు తిప్పింది అదే సినిమా అని.. మంచి డైరెక్టర్ "ఆది" సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తే ఖచ్చితంగా అందులో నటించడానికి నో చెప్పను అని.. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను అని ..దేవుడు తడుచుకుంటే అది ఎంతసేపు అని .."ఎన్టీఆర్ మాట్లాడడం ఫాన్స్ కి కూడా బాగా నచ్చేసింది.  అయితే ఇప్పుడు ఆది సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తే  మాత్రం ఖచ్చితంగా బోయపాటి శ్రీను డైరెక్టర్ అయితేనే బాగుంటుంది అంటున్నారు నందమూరి అభిమానులు . మాస్ యాషన్ సినిమాలకు పెట్టింది పేరుగా పాపులారిటీ సంపాదించుకున్న బోయపాటి శ్రీను జూనియర్ ఎన్టీఆర్ తో ఆది 2 తెరకెక్కిస్తే బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే అంటున్నారు . చూద్దాం మరి ఆ టైం ఎప్పుడు వస్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: