పూరి జగన్నాధ్ సెన్సేషనల్ డెసీషన్.. ఇక ఒక్కోక్కడికి ఉ* కారిపోవాల్సిందే..!

Thota Jaya Madhuri
పూరి జగన్నాథ్ .. ఈ పేరు చెప్తే ఇప్పుడు కుర్రాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారు ఏమో కానీ ఒకప్పుడు మాత్రం ఓ రేంజ్ లో అరుపులు కేకలతో థియేటర్స్ లో హోరెత్తించేసేవారు . మరీ ముఖ్యంగా పూరి జగన్నాథ్ అన్న పేరు వినపడితే అందరికీ మొదట గుర్తు వచ్చేది ఇడియట్ సినిమా . ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు . టీవీలో వస్తే ఇప్పటికీ ఫ్యామిలీ కూర్చొని చూసి ఎంజాయ్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఒక తండ్రి ఒక కొడుకు మధ్య ఉండే బాండింగ్ ..ఒక తల్లి ఒక కొడుకు మధ్య ఉండే రిలేషన్షిప్ ..చెల్లి కోసం అన్న ప్రవర్తించే పద్ధతి ..ఒక గర్ల్ ఫ్రెండ్ ని ఏ విధంగా ప్రేమించాలి అనే తీరును కళ్లకు కట్టినట్లు చూపించాడు పూరి జగన్నాథ్ .


ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మనందరం బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటాం. అలాంటి పూరీ జగన్నాథ్ కెరీర్ ఇప్పుడు ఎంత డిజాస్టర్ గా మారిందో మనకు తెలిసిందే . లైగర్ సినిమాతో ఏదో చించేద్దాం పొడిచేద్దాం అనుకున్న రేంజ్ లో తెరకెక్కించాడు కానీ బాలీవుడ్ మీడియా మొత్తం పూరి జగన్నాధ్ ను అలాగే విజయ్ దేవరకొండను దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తుంది . కాగా ఆయన కెరియర్ లోనే ఆయన డ్రీం ప్రాజెక్ట్ "జనగణమన" కూడా రెండుసార్లు తెరకెక్కినట్టే ఆగిపోయింది.


అయితే పూరి జగన్నాధ్ ను నమ్మి ఏ హీరో కూడా కాల్ షీట్లు ఇవ్వడం లేదు . ఇలాంటి క్రమంలోనే పూరి జగన్నాథ్ స్పెషల్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది . పూరి జగన్నాథ్ తన కెరియర్ లోనే సూపర్ డూపర్ హిట్ సినిమాకి సీక్వెల్  తెరకెక్కించబోతున్నారట. ఆ మూవీ ఏదో కాదు "ఇడియట్". అంతేకాదు ఇడియట్ 2 లో కూదా రవితేజ నే హీరోగా నటించబోతున్నారట . అయితే హీరోయిన్గా మాత్రం శ్రీలీల ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నారట . ఇది మొత్తం మాటల దశలోనే ఉంది అని త్వరలోనే సెట్స్ పైకి రాబోతుంది అని ..వన్స్ ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే ఇక మిగతా డైరెక్టర్ లు అందరికి  టెన్షన్ మొదలైన్నటే  అంటున్నారు పూరి జగన్నాథ్ అభిమానులు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: