దీపావళినాడు కనిపించబోతున్న ఎన్టీఆర్ మునిమనవడు !

Seetha Sailaja
ఇప్పటివరకు నందమూరి తారకరామారావు మూడవ తరం వారసులను సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులు చూశారు. త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే మోక్షజ్ఞ నటించబోతున్న మూవీ ఇంకా ప్రారంభం కాకుండానే ఎన్టీఆర్ నాల్గవ తరం వారసుడు మూవీ ప్రారంభానికి రాబోతున్న దీపావళి రోజున రాబోతోంది.

ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ అన్న విషయం అందరికీ తెలిసిందే. హరికృష్ణ   కొడుకు జానకి రామ్ తనయుడు నందమూరి తారకరామారావు అతడు గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు మూడు సినిమాలలో నటించాడు. ఇప్పుడు అతడు హీరోగా మారబోతున్నాడు. ఎన్టీఆర్ కుటుంబానికి వీరాభిమాని గతంలో హరికృష్ణ తో అనేక సినిమాలు తీసిన దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి జూనియర్ ఎన్టీఆర్ ను హీరోగా పరిచయం చేస్తూ మొదలు పెట్టబోతున్న మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన దీపావళి రోజున రావొతోంది.

ఆరోజునే వైవీఎస్ చౌదరి ఎన్టీఆర్ నాల్గవ తరం వారశుడుకు సంబంధించిణ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారాని తెలుస్తోంది. దాదాపు 10 సంవత్సరాల క్రితం సాయి ధరమ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీసిన తరువాత దాదాపు 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని నిర్మాత వైవీఎస్ చౌదరి నిర్మిస్తున్న మూవీ కావడంతో ఈమూవీ పై చాలమందిలో ఆశక్తి ఉంది.

ఇప్పటికే ఎన్టీఆర్ వారసులుగా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తమ హవా కొనసాగిస్తున్న నేపధ్యంలో త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అంతా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎవరు ఊహించని విధంగా మరో జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అత్యంత ఆశక్తి దాయకంగా మారింది. దీనితో త్వరలో సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్న మోక్షజ్ఞ జూనియర్ ఎన్టీఆర్ ల రాక గురించి తెలుగు ప్రజలు చాల ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త తరం నందమూరి వారసులకు తెలుగు ప్రేక్షకులు ఎలాంటి స్పందన ఇస్తారో వేచి చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: