మాట మార్చి ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నారుగా.. పవన్ సినిమాపై గందరగోళం..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని పోస్టర్లను , ఒక వీడియోను కూడా విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా మలయాళం లో అద్భుతమైన విజయం సాధించిన తేరి అనే సినిమాకు అధికారిక రీమేక్ గా రూపొందుతుంది అని ఓ వార్త చాలా రోజులుగా అవుతుంది.

ఇకపోతే ఈ సినిమాకు ప్రముఖ సినిమా దర్శకుడు అయినటువంటి దశరథ్ స్క్రీన్  ప్లే రైటర్ గా పని చేస్తున్నాడు. ఈయన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి రెండు సార్లు రెండు రకాలైన అప్డేట్లను ఇచ్చాడు. దానితో పవన్ ఫ్యాన్స్ అసలు ఏది నిజం అనే దానిపై కన్ఫ్యూజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... దశరథ్ చాలా కాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... నేను పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్నాను. అది తేరి అనే సినిమాకు రీమేగా రూపొందుతుంది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజాగా ఈయన దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా రీ రిలీస్ అయింది. ఆ సందర్భంగా ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా దశరథ్ కి మీరు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్నారు కదా అది తేరి సినిమాకు రీమేక్ గా రూపొందుతుందా అనే ప్రశ్న ఎదురయింది.

దీనికి ఆయన సమాధానం ఇస్తూ ... అది తేరి సినిమాకు కాదు మరే మూవీ కి కూడా రీమేక్ కాదు. అది ఒక కొత్త కథతో రూపొందుతుంది. అది ఒక మిస్ కమ్యూనికేషన్ వల్ల వచ్చిన న్యూస్ తప్ప మరేమీ లేదు అని చెప్పుకొచ్చాడు. దీనితో ఈయన పాత ఇంటర్వ్యూలో చెప్పింది కరెక్టా ..? ఇక కొత్త ఇంటర్వ్యూలో చెప్పింది కరెక్టా అనే కన్ఫ్యూజన్లో పవన్ ఫ్యాన్స్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: