మహానటి సావిత్రి అంత్యక్రియలకు హాజరైన ఏకైక ఈ తరం స్టార్ హీరో ఎవరు అంటే..!

Amruth kumar
 . . ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
ఈ జనరేషన్ హీరోల్లో చిరంజీవి మాత్రమే సావిత్రి తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . అయినా సావిత్రి అంత్యక్రియలకు రాలేదు . కానీ ఈ తరం హీరో ఒకరు హాజరయ్యారు. మన తెలుగు చిత్ర పరిశ్రమ లోనే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమ లోనే ఎంత మంది హీరోయిన్లు వచ్చిన మహానటి సావిత్రి తర్వాతే అందరూ. మహానటి గా పేరు తెచ్చుకున్న సావిత్రి నాటకాల ద్వారా సినిమాల్లో అడుగు పెట్టి చిత్ర పరిశ్రమ లోనే గొప్ప నటిగా ఎదిగింది . ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ వంటి అగ్ర హీరోల కు పోటీ గా నటిస్తూ వారికే తన నటనతో చెమటలు పెట్టించింది సావిత్రి .

అలాంటి సావిత్రి జీవితం లో ఎన్నో మలుపులు .. కోట్ల ఆస్తి సంపాదించి చివరి కి ఏ దిక్కు లేని మనిషి గా చనిపోయింది . ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ను వదిలేసింది .. సరిగ్గా కడుపున పుట్టి న పిల్లల నుచూసుకో లేకపోయింది . మద్యానికి బానిస అయి సంవత్సరానికి పైగా కోమాలో ఉన్న సావిత్రి 1981 డిసెంబర్ 26 న కన్నుమూచారు . సావిత్రి అంత్యక్రియలకు ఎంజీఆర్ , ఏఎన్నార్ , జయసుధ , గుమ్మడి , భారతీ రాజా తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు సావిత్రి అంత్యక్రియల కు హాజరయ్యారు .

ఇక చిరంజీవి నటించిన పునాదిరాళ్ళు , ప్రేమ తరంగాలు సినిమాల్లో సావిత్రి నటించారు . అయినప్పటికీ చిరంజీవి సావిత్రి అంత్యక్రియలకు హాజరు కాలేదని సమాచారం . ఈ తరం నటుల్లో బాలకృష్ణ మాత్రమే హాజరయ్యారట . అందుకు కారణం ... ఎన్టీఆర్ వెళ్లలేకపోయారట . ఆ కుటుంబం నుంచి బాలకృష్ణ వెళ్లారట . అలా ఈ తరం హీరోలలో నందమూరి బాలకృష్ణ మాత్రమే మహానటి సావిత్రి అంత్యక్రియలో పాలుపంచుకొని అవకాశం దక్కిందని అంటారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: