మహేష్ బాబు ఫ్లాప్ సినిమా కోసం.. ఫ్రెండ్స్ తో కూడా కొట్లాడినా: విజయ్ దేవరకొండ

praveen
విజయ్ దేవరకొండ గురించి తెలుగు కుర్రకారుకి పరిచయం అక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ రాత్రికి రాత్రే సూపర్ స్టార్ స్థాయిని అందుకున్నాడు. అక్కడినుండి అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. తరువాత చేసిన గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా చేరువ అయ్యాడు. అలాంటి విజయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్లాప్ సినిమా కోసం తన ఫ్రెండ్స్ తో కొట్లాట ఆడాడని మీకు తెలుసా? నిజం. ఇదే విషయాన్ని విజయ్ దుల్కర్ సల్మాన్ హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో, నాగవంశీ నిర్మించిన 'లక్కీ భాస్కర్‌' సినిమా ప్రమోషన్లో భాగంగా చెప్పుకు రావడం జరిగింది.
ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ అదిరిపోవడంతో దీపావళి సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను నిర్వహించగా త్రివిక్రమ్‌ భార్య సాయి సౌజన్య ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో త్రివిక్రమ్‌ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ సైతం దీనికి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ వేదికపై విజయ్ మాట్లాడుతూ... దుల్కర్ సల్మాన్‌ తో ఒక మల్టీస్టారర్ సినిమాకు సంబంధించిన చర్చలు జరిగాయని, అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కార్యరూపం దాల్చలేదని చెబుతూనే భవిష్యత్తులో మళ్లీ కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా దుల్కర్‌ తో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
ఇంకా విజయ్‌ మాట్లాడుతూ... తనకు అత్యంత ఇష్టమైన దర్శకుల్లో త్రివిక్రమ్‌ ఒకరని, ఆయన దర్శకత్వంలో వచ్చిన ఖలేజా సినిమా అంటే తనకు చాలా ఇష్టం చెప్పుకొచ్చాడు. ఖలేజా సినిమాను అప్పట్లో ఎవరైనా బాగాలేదని అంటే వారితో గొడవ పడేవాడిని అని, ఈ క్రమంలోనే తన ఫ్రెండ్స్ తో కొట్లాట ఆడేవాడినని చెప్పుకొచ్చాడు. దాంతో ఖలేజా సినిమా పై తనకు ఉన్న ప్రత్యేక అభిమానంను విజయ్‌ దేవరకొండ చెప్పడంతో ఆ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఫ్యాన్స్‌తో పాటు చాలా మంది సైతం విజయ్‌ దేవరకొండ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. కాగా లక్కీ భాస్కర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: