తెలుగులో ఫ్లాప్స్.. హిందీలో బ్లాక్ బస్టర్.. ఆ నిర్ణయం ఆ హీరోయిన్ల కెరీర్నే మార్చేసింది..?

Pulgam Srinivas
చాలా మంది నటీ మణులు తెలుగు లో అద్భుతమైన క్రేజ్ వచ్చాక హిందీ సినీ పరిశ్రమ వైపు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక కొంత మంది ముద్దు గుమ్మలు మాత్రం తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను ఎదుర్కొని ఆ తరువాత హిందీ సినిమా పరిశ్రమ వైపు ఇంట్రెస్ట్ చూపి అక్కడ బాలీవుడ్ హీరోయిన్లకే షాక్ ఇచ్చే రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నారు. అలాంటి వారు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 1 నేనొక్కడినే అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ తెలుగు తెరకు పరిచయం అయింది.

ఈ సినిమా ప్లాప్ అయినా ఈమెకు ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమె నాగ చైతన్య హీరోగా రూపొందిన దోచేయ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా వరుసగా రెండు తెలుగు సినిమాల ద్వారా ఈమెకు ప్లాపులు రావడంతో ఈమె హిందీ సినిమాలపై ఆసక్తిని చూపించింది. ఇక హిందీ లో ఈమె నటించిన మూవీలు బ్లాక్ బాస్టర్ విజయాలు సాధించడంతో ఈమె హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీ లకి వెళ్లి సక్సెస్ అయిన వారిలో దిశా పటానీ ఒకరు. ఈ ముద్దు గుమ్మ తెలుగు లో లోఫర్ అనే మూవీ తో కెరియర్ను మొదలు పెట్టింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈమె హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అక్కడ మాత్రం సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: