వారిద్దరిలో టైటిల్ ఎవరిది.. శనివారమే విన్నర్ ఎవరో తేల్చేయబోతున్న నాగార్జున?
హౌస్ విషయానికొస్తే ప్రస్తుతం అందులో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో అవినాష్ ఒక్కడే ఫైనల్ బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్టు చాలా స్పష్టంగా అర్ధం అవుతోంది. మిగతా 6 మంది నామినేషన్స్ లో ఉన్నారు మరి. అందులో ఒకరు లేదా ఇద్దరు ఎలిమినేట్ కాకతప్పదు. మిగతా కంటెస్టెంట్స్ ఫైనలిస్ట్స్ గా టైటిల్ రేసులో ఉంటారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ పోరు గౌతమ్, నిఖిల్ మధ్యే అంటున్నారు. ఓటింగ్ లో కూడా గౌతమ్, నిఖిల్.. మొదటి రెండు స్థానాల్లో ఉంటూ వస్తున్నారు. కాబట్టి ఈసారి టైటిల్ అందుకునేది వీరిద్దరిలో ఒకరు అని తేలిపోయింది. డిసెంబర్ 7 శనివారం కాగా హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నారు.
దాంతో చాలా ప్రత్యేకత సంతరించుకోనుంది. నాగార్జున కంటెస్టెంట్స్ ని తిట్టినా కొట్టినా ఈ ఒక్కరోజే ఫైనల్. లాస్ట్ వీక్ లో హోస్ట్ రివ్యూలు అనేవి ఉండవు. ప్రేక్షకులదే ఫైనల్ జడ్జిమెంట్. విన్నర్ ఎవరో వారే నిర్ణయిస్తారు. అయితే దానికి ఫైనల్ వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. ఈ శనివారమే నాగార్జున విన్నర్ ఎవరో తేల్చేస్తాడని అంటున్నారు విశ్లేషకులు. ఎలా అంటే? గౌతమ్, నిఖిల్ మధ్య టైటిల్ రేసు నడుస్తుంది. ఈ వారం వారు గొడవలు పడిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి నాగార్జున ఖచ్చితంగా సదరు గొడవల్లో తప్పు ఎవరిదో తేల్చే ప్రయత్నం చేస్తాడు. తప్పు నీదే అని నాగార్జున ఎవరిని తిడతారో అతడే విన్నర్ అని జోశ్యం చెబుతున్నారు ప్రేక్షకులు. మరి మీ అనుమానం ప్రకారం ఎవరికి టైటిల్ దక్కుతుందో ఇక్కడ కామెంట్ చేయండి.