ప్రెగ్నెంట్ భార్యతో మార్కో సినిమాకు వెళ్లిన టాలీవుడ్ స్టార్ . తర్వాత ఏం జరిగిందంటే..?

frame ప్రెగ్నెంట్ భార్యతో మార్కో సినిమాకు వెళ్లిన టాలీవుడ్ స్టార్ . తర్వాత ఏం జరిగిందంటే..?

Amruth kumar
భారతీయ చిత్ర పరిశ్రమలోనే మోస్ట్ వైలెంట్ సినిమాగా పేరు తెచ్చుకున్న మార్కో ..  ఉన్ని ముకుందన్ హీరోగా వచ్చిన ఈ సినిమా మలయాళం లో రిలీజ్ అయింది .. జనతా గ్యారేజ్ , భాగమతి లాంటి సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉన్ని .. ఈయన హీరోగా హనీఫ్ అదేని  తెరకెక్కించిన ఈ సినిమానే మార్కో .. భారీ రివేంజ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో వైలెన్స్ ఊహించని లెవ‌లో ఉంటుంది .. దాని గురించి చెప్పడానికి మాటలు కూడా చాలవు .. అసలు సెన్సార్ బోర్డును తప్పించుకుని ఈ సినిమా బయటికి ఎలా వచ్చిందని చాలామంది ధియేటర్లో అనుకునే ఉంటారు .  ఆ రేంజ్ లో ఈ సినిమాలో వైలెన్స్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు .. చాలా వరకు ఈ సినిమాలో సన్నివేశాలు చూస్తుంటే ఒల్లు గగురు పొడుస్తుంది చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు ఈ సినిమాని చూడద్దని దర్శక నిర్మాతలే ప్రమోషన్స్ లో చెప్పారు .

 
ఇక దీన్ని బట్టి వాళ్ళు ఏ స్థాయిలో వైలెంట్గా ఈ సినిమాలు చేశారో అనేది చెప్పకనే చెప్పేశారు .. అయితే ఈ సినిమా ఓటీటీళ్లు విడుదలైన తర్వాత కొన్ని సన్నివేశాలను కట్ చేయాల్సి వచ్చింది . ఇక సాటిలైట్ లో మార్కోను సినిమా ప్రదర్శించకూడదు అంటూ సెన్సార్ బోర్డ్ సినిమాను తిరస్కరించింది .. ఈ సినిమాను బుల్లితెరపై చూడలేము .. అలాగే ఇలాంటి సినిమాల కు వెళ్లాలంటే కాస్త ధైర్యం ఎక్కువగా కావాలి .. ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు చెబుతున్నామంటే ఈమధ్య కాలంలో మార్కో సినిమాకు వెళ్లి  సగం అయిన తర్వాత థియేటర్ నుంచి బయటికి వచ్చారు ఒక టాలీవుడ్ హీరో .. భార్యతో పాటు ఆ సినిమాకి వెళ్లిన ఆయన సినిమా పూర్తి అవ్వకుండానే బయటికి వచ్చేసారు .. ఈ విషయాన్ని చెప్పింది కూడా మ‌రి ఎవరో కాదు స్వయాన ఆ హీరోనే .

 
ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారు కదా ఇంతకీ ఆ హీరో మరి ఎవరో కాదు కిరణ్ అబ్బవరం .. మార్చి 14న దిల్ రూబా సినిమా విడుదల కానుంది ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగానే మార్కో సినిమా గురించి కిరణ్ చెప్పకు వచ్చాడు .. ప్రెగ్నెంట్ గా ఉన్న తన భార్య రహస్యతో కలిసి మార్కో సినిమాకు వెళ్లానని ..  సినిమా సెకండాఫ్ మొదలైన కాసేపటికి థియేటర్ నుంచి బయటికి వచ్చేసాము అని చెప్పుకొచ్చాడు కిరణ్ .. గర్వవతిగా ఉన్న తన భార్య సినిమా చూడలేక పోయిందని .. వైలెన్స్ తట్టుకోలేక థియేటర్ మధ్యలోనే వెళ్లిపోయాం .. అయితే ప్రస్తుతం కిరణ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: