థియేటర్ లో తుస్సుమన్న.. ఓటీటీలో అదరగొడుతున్న సినిమా ఇదే!

MADDIBOINA AJAY KUMAR
ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఓటీటీలు వచ్చినప్పటినుండి చాలా మంది థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడడం మానేశారు. ఈ వారం థియేటర్ లలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా చాలానే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.


అయితే అందులో ఒక సినిమా మాత్రం థియేటర్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ వినిపిస్తుంది. మరి ఆ సినిమా ఏంటో.. ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమా ఓటీటీలో మంచి హిట్ కొట్టింది. బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా 1975 లో ఇండియా ఎమర్జెన్సీ విధించిన ఘటనల ఆధారంగా రూపొందింది. ఈ సినిమా ఒక హిస్టోరీకల్ సినిమా.

కంగనా రనౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో థియేటర్ లో విడుదల అయింది. ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాక హిట్ కొట్టకపోవడంతో ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి దాదాపు 2 నెలలు పట్టింది. ఈ సినిమా మార్చి 14 నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ప్లీక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే టాప్ వన్ లోకి వచ్చింది. ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి ఆదరణ సొంతం చేసుకుని మిలియన్ల వ్యూస్ ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: