కుంభమేళా సన్యాసి ఏమైంది ఎక్కడికి పోయింది.. అసలు మేటర్ ఇదే..?

frame కుంభమేళా సన్యాసి ఏమైంది ఎక్కడికి పోయింది.. అసలు మేటర్ ఇదే..?

Amruth kumar
90వ దశకంలో భారతీయ చిత్ర పరిశ్రమలో మమతా కులకర్ణి ఓ వెలుగు వెలిగింది. బోల్డ్ క్యారెక్టర్స్‌కు పెట్టింది పేరుగా నిలిచింది. తన అందంతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. ఒంటిపై బట్టలు లేకుండా ‘డస్ట్ మ్యాగజైన్’ కవర్ పేజీలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటో షూట్‌ అప్పట్లో ఇండస్ట్రీని షేక్‌ చేసింది. హీరోయిన్‌గానే కాకుండా ఐటెమ్ సాంగ్స్‌తోనూ అభిమానులను అలరించింది. కెరియర్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న సమయంలో విక్కీ గోస్వామిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో మమతా కులకర్ణి అరెస్ట్‌ అయ్యింది. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైంది.

గతంలో తన అంద చంద‌ల తో యువత మతులు చెడగొట్టి నటి మమతా కూలకర్ణి ... దాదాపు పాతి కేళ్ల తర్వాత ఇండియా కి వచ్చిన ఈ నటి కుంభమేళా లో సందడి చేసిన విషయం తెలిసిందే .. త్రివేణి సంగ‌మంలో మునిగి ఆమె సాధువు గా మారిపోయింది .. కిన్నార్ అఖాడ సంస్థ  ఆమె ను సన్యాసి గా మార్చి మహా మండలేశ్వర్ అనే బిరుదు కూడా ఇచ్చేసింది .  అయితే ఆ వెంటనే అఖాడ లో గొడవలు కూడా మొదలయ్యాయి .  అమె ను ఎలా యోగినీ గా మారుస్తార ని పైగా బిరుదు అలా ఇస్తారంటూ గొడవలు గట్టిగా జరిగాయి ..

దీంతో అఖాడ లో కొందరు పదవుల కి కూడా రాజీనామాలు చేయాల్సి వచ్చింది  .. ఆ తర్వాత మమత కులకర్ణి కి ఇచ్చిన బిరుదు ను కూడా వెనక్కి తీసేసుకున్నారు .. అంతే కాకుండా ఆమెను అఖాడ లో చేర్చు కోవ‌డానికి కూడా నో చెప్పారు . ఇదంతా కుంభమేళా టైంలో జరిగిన విషయం .. మరి ఇంత జరిగిన తర్వాత కూడా మమతా కులకర్ణి ఇప్పుడు ఎక్కడ ఉంది .. ఏం చేస్తుంది .. గత కొన్ని రోజుల పాటు ముంబాయి లో కనిపించిన ఈ 52 సంవత్సరాల హీరోయిన్ ... ఇప్పుడు మరోసారి విదేశాల కు వెళ్లి పోయినట్టు తెలుస్తుంది .. ఇక ఈసారి ఆమె తిరిగి భారత్ లో అడుగు పెట్టే అవకాశం లేద ని కూడా ఆమె స‌న్నిహితులు అంటున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: