అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు గ్లామరస్ హీరోయిన్

frame అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు గ్లామరస్ హీరోయిన్

MADDIBOINA AJAY KUMAR
ఈ మధ్యకాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వారి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా వారి పేర్లను, ఫోటోస్ ని షేర్ చేస్తున్నారు. అమ్మాయిల విషయానికి వస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్లే ఇప్పుడు ముఖ్య పాత్రలో హీరోయిన్ గా చాలా సినిమాలలో కనిపిస్తున్నారు. అలాగే అబ్బాయిలు కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా చేసి.. ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్నారు. ఇక తాజాగా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో నేటింటా చాలా వైరల్ అవుతుంది. అయితే ఆ ఫోటో ఎవరిది.. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తున్నారా.

 
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన జై చిరంజీవ సినిమాలో ఈ చిన్నారి కనిపించింది. ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిన్నారి తన నటనతో ప్రేక్షకుల మనసును దోచుకుంది. అయితే ఆ చిన్నారి ఎవరంటే శ్రియ శర్మ. ఈమె జై చిరంజీవ సినిమాలో చిరంజీవికి మేన కొడలిగా నటించింది. ఐశు పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో శ్రియ శర్మ ఎంతో క్యూట్ గా, ముద్దుగా ఉంటుంది. పెద్ద కళ్లతో, స్వీట్ స్మైల్ తో అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమాలో శ్రియ శర్మ చిరంజీవి మేనకోడలిగా చాలా బాగా యాక్ట్ చేసింది. జై చిరంజీవ సినిమాతో మంచి హిట్ ని కూడా అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా భూమిక, సమీరా రెడ్డి నటించారు. జై చిరంజీవ సినిమాలో నటించినప్పుడు శ్రియ శర్మ వయసు నాలుగైదేళ్లు ఉండేది.

 
ఈ చిన్నారి ఇప్పుడు పెద్దగా అయ్యి.. హీరోయిన్ గా మారిపోయింది. ఈ అందాల భామ ఇప్పటికే ఒక సినిమా కూడా తీసింది. హీరో శ్రీకాంత్ కుమారుడు నటించిన నిర్మల కాన్వెంట్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత గాయకుడు సినిమాలో కూడా శ్రియ శర్మ నటించి అలరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: