ఏఐ గొప్పదని చెప్పడంలో తప్పులేదు: ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీపైన ఏఐ ప్రభావం చాలా ఉంది. ఏఐ మనిషి కన్నా వేగంగా పరిగెడుతుంది. మనం క్రియేట్ చేసిన టెక్నాలజీయే మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఏఐనే.. మనమే కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఏఐని దేవుడు ఉన్నాడా అని అడిగిన సమాధానం చెప్తుంది. వైద్యం గురించి కూడా చెప్పేస్తుంది. డాక్టర్ తో కూడా అవసరం లేదు. ఏఐ కారణంగా కొన్ని లక్షల కేసులు వస్తుంటాయి. అలాంటప్పుడు మనిషి కంటే ఏఐ గొప్పదని చెప్పడంలో తప్పులేదు' అని వర్మ చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అయితే ఇదిలా ఉండగా.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ శారీ. ఈ సినిమాలో సత్య యాధు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాకు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 4న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా శారీ కాదు స్కేరి అనేలా ఉందని టాక్ వినిపించింది.