లక్ అంటే వెంకటేష్ దే.. అన్ బిలీవబుల్ ఆఫర్ ని పట్టేసాడుగా..!

Amruth kumar
తెలుగు ఇండస్ట్రీకి ఎన్నెన్నో స్పెషల్ రికార్డ్స్ క్రియేట్ చేసి పెట్టారు. తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఈ రేంజ్ లో ఎదిగింది అంటే వీళ్ళ పాత్ర ఎంతైనా ఉంది అని చెప్పుకోవడం లో సందేహం లేదు. కాగా మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలయ్య.. అక్కినేని నాగార్జున .. ఓ జోనర్ లో మూవీస్ చూస్తుంటే విక్టరీ వెంకటేష్ మాత్రం క్రేజీ క్రేజీ కాంబోలని సెట్ చేసుకున్నారు . కాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ ఏ సినిమా ని అనౌన్స్ చేయలేదు . సంక్రాంతి వస్తున్నాం సినిమా హిట్ ఎఫెక్ట్ ఇప్పటికీ విక్టరీ వెంకటేష్ పై కొనసాగుతూనే ఉంది .



ఎక్కడికి వెళ్ళినా సరే విక్టరీ వెంకటేష్ ని సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని డైలాగ్స్ తో బాగా ట్రెండ్ చేస్తున్నారు.  కాగా విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మరొక క్రేజీ కాంబో ని సెట్ చేశారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో  వెంకటేష్ ఓ సినిమాలో నటించబోతున్నాడు.  దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు కానీ..  పూర్తిగా స్క్రిప్ట్ ని కూడా రెడీ చేసేసారట త్రివిక్రమ్ . రేపో మాపో  అఫీషియల్ ప్రకటన కూడా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.



అంతేకాదు సెట్స్ పైకి కూడా ఈ మూవీని త్వరగా తీసుకొచ్చేస్తారు అంటూ ఫిలిం ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . కాగా ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మించబోతున్నట్లు కూడా తెలుస్తుంది . గతంలో త్రివిక్రమ్ .."వెంకీ" నటించిన నువ్వు నాకు నచ్చావ్ ..మల్లీశ్వరి సినిమాలకు రచయితగా వర్క్ చేశారు . ఆ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ . మరి ముఖ్యంగా డైలాగ్స్ అయితే ఓ రేంజ్ లో పెలాయి. బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకున్నాయి. కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకుడిగా మారిన తర్వాత వెంకటేష్ తో కాంబో కుదరడం పై  అంచనాలు పెంచేస్తుంది. ఈ క్రేజీ కాంబో కచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్ర ను తిరగరాస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: