"నంది,ఆస్కార్ అవార్డ్ లు అయితే ఎగేసుకుని తీసుకుంటారా..?"..ఆ స్టార్ హీరోస్ పై దిల్ రాజు సీరియస్..!?
గద్దర్ అవార్డు వేడుకలో సినీ స్టార్స్ పాల్గొని సందడి చేసినందుకు థాంక్స్ చెప్తూనే ఎవరైతే అవార్డు తీసుకోవడానికి రాలేదో వాళ్ళకి ఇచ్చి పడేసారు. రీసెంట్గా దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టారు . అందరికీ ఓ రేంజ్ లో ఘాటుగానే ఇచ్చి పడేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ కి కొంతమంది అవార్డు గెలుచుకున్న వాళ్ళు రాకుండా వాళ్ళ తరపున ప్రతినిధులు వచ్చి అవార్డ్స్ తీసుకోవడం పట్ల దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు . పురస్కారం అందుకోవాల్సిన వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే డైరీలో డైట్ నోట్ చేసుకొని రావాలని ప్రభుత్వంతో ప్రయాణంలో ఇది కూడా బాధ్యతనే అని స్ట్రాంగ్ గా గుర్తు చేశారు .
నిజానికి ఆయన చేసిన విన్నపంలో న్యాయం ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన అవార్డులను మళ్లీ కాంగ్రెస్ సర్కార్ తిరిగి తీసుకువచ్చింది అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది . కానీ కొంతమంది సినీస్టార్స్ ఇది ఏది పెద్దగా పట్టించుకోకుండా లైట్ గా తీసుకున్నారు . నంది - ఆస్కార్ అవార్డు అయితేనే వచ్చి తీసుకుంటారా ..? గద్దర్ అవార్డ్స్ తీసుకోరా..? అంటూ కొంతమంది తెలంగాణ ప్రజలు కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అయితే మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరిని ఈవెంట్ కి పిలిచిన రాకపోవడం దిల్ రాజుకి కోపం తెప్పించింది . మరీ ముఖ్యంగా ఒక మలయాళ హీరీ..ఇద్దరు తెలుగు హీరోలు ఈవెంట్ కి డుమ్మ కొట్టడం అందరికి కోపం తెప్పించింది. దిల్ రాజు పేర్లు ప్రస్తావించకుండానే ఇలా మాటలతో దెబ్బ కొట్టడం అందరికీ షాకింగ్ గా ఉంది. ఈ మధ్యకాలంలో దిల్ రాజు ఒక కాంట్రవర్షియల్ మాటల్లో కూడా ఇరుక్కున్నాడు. ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటికి వచ్చాడు . మళ్ళీ ఇప్పుడు దిల్ రాజు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళకి ఇచ్చి పడేయడం నిజంగానే రివేంజ్ దెబ్బ అంటున్నాడు కొంతమంది జనాలు . కానీ దిల్ రాజు మాట్లాడిన మాటలు మాత్రం పూర్తిగా వాస్తవమంటూ ఆయన ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు..!!