శృతిహాసన్ సోషల్ మీడియా నుంచి అలాంటి పోస్టులు.. షాక్ లో ఫ్యాన్స్..!

Divya
నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్లలో శృతిహాసన్ కూడా ఒకరు.. తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా శృతిహాసన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్  గురైనట్లుగా తెలుస్తోంది.. శృతిహాసన్ అకౌంటు నుంచి బీట్ కాయన్, క్రిక్టోకరెన్సీ కి సంబంధించిన కొన్ని సందేశాలు కూడా పోస్ట్ అవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో శృతిహాసన్ ఖాతా నుంచి ఇలా వరుసగా పోస్టులు రావడంతో మరింత ఆశ్చర్యపోయారు.



అయితే ఈ విషయం శృతిహాసన్ వరకు వెళ్ళగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ నుంచి తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.. శృతిహాసన్ తన ఇంస్టాగ్రామ్ నుంచి దయచేసి ఎవరూ కూడా ఆ మెసేజ్ లకు రిప్లై ఇవ్వకండి.. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని తెలియజేయాలనుకుంటున్నాను అంటూ ఒక విషయాన్ని తెలిపింది శృతిహాసన్. తిరిగి తన అకౌంట్ రికవరీ చేసుకునే వరకు ఎవరు కూడా ఆ పేజీలో చాట్ చేయవద్దు.. ఎలాంటి విషయాలను షేర్ చేయవద్దు అంటూ లవ్ ఎమోజితో హార్ట్ సింబల్ ని షేర్ చేసింది శృతిహాసన్.


అయితే శృతిహాసన్ సోషల్ మీడియా హ్యాక్ అవ్వడం ఇదేమి ఫస్ట్ టైం కాదు.. 2017 లో కూడా శృతిహాసన్ ఖాతాను ఎవరో హ్యాక్ చేయడం జరిగింది. మళ్లీ ఇప్పుడు ఇలా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవడంతో శృతిహాసన్  అకౌంట్ ని హ్యాక్ చేస్తున్నది ఎవరా అని పలువురు నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. శృతిహాసన్ సినిమాల విషయంలో కూడా బాగానే ఇటివలె వరుస సినిమాలతో అదరగొట్టేస్తోంది. క్రాక్, వకీల్ సాబ్, వాల్తేరు వీరయ్య, సలార్ 1 తదితర చిత్రాలలో నటించింది. ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనకరాజు డైరెక్షన్లో కూలి సినిమాలో నటిస్తోంది. అలాగే విజయ్ సేతుపతి నటిస్తున్న ట్రైన్ చిత్రంలో కూడా నటిస్తున్నదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: