సినిమా కార్మికుల సమ్మె.. రంగంలోకి చిరంజీవి.. ఆ విధంగా చెక్ పెట్టనున్నారా?

Reddy P Rajasekhar
సినిమా కార్మికుల సమ్మె రోజురోజుకు తీవ్రం అవుతున్న సంగతి తెలిసిందే సమ్మె కొనసాగడం వల్ల కలెక్షన్లపై కూడా ఊహించని స్థాయిలో ఎఫెక్ట్ పడుతోంది. అయితే సినిమా కార్మికుల సమ్మె విషయంలో చిరంజీవి రంగంలోకి దిగారు. సమ్మె వల్ల ఇప్పటికే షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమాపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది. 2 వేల రూపాయల లోపు వేతనాలు ఉన్నవాళ్లకు పర్సెంటేజ్ ల ప్రకారం పెంచుతామని నిర్మాతలు వెల్లడించారు.

అయితే ఆ షరతులకు కార్మికులు ఒప్పుకోకపోవడం వల్ల ఈ సమస్య ఎదురైంది.  అయితే ఈ వివాదంలోకి  మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు.  కార్మిక వేతనాలు పెంచాలని గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నామని  చిరంజీవి మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడారని  ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు.  24 విభాగాల నుంచి 72 మందితో చిరంజీవి చర్చించారని ఆయన చెప్పుకొచ్చారు.

నిర్మాతలు మా మాట వినకుండా మా మీదే నిందలు వేస్తున్నారని వాళ్ళు చెప్పుకొచ్చారు.  సాధ్యం కానీ, అమలు చేయలేని రూల్స్ పెడుతున్నారని తెలిపామని  ఏదేమైనా మా కార్మికులతో పాటు నిర్మాతలు కూడా బాగుండాలని  నిర్మాతల షరతులను పాటిస్తే మాత్రం మేము తీవ్రంగా నష్టపోతామని చెప్పుకొచ్చారు.

ఆదివారం డబుల్ కాల్ షీట్ గురించి కూడా చిరంజీవికి విన్నవించామని  మీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పాలని చిరంజీవి గారు అన్నారని ఛాంబర్ నుంచి మాకు కూడా పిలుపు వచ్చిందని  చర్చలకు పిలిచారు కాబట్టి మేము ప్రస్తుతానికి నిరసన ఆపేస్తున్నామని చెప్పుకొచ్చారు.  మేము అడిగినట్లు  వేతనాల పెంపు వస్తుందని భావిస్తున్నామని అన్నారు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: