ఆ పదవిపై దృష్టి పెట్టిన బాలయ్య, పవన్ కళ్యాణ్... ఎవరు నెగ్గుతారో?
సినిమా పరిశ్రమలో సుపరిచితుడైన నిర్మాత ఎ.ఎం.రత్నం పేరును ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పదవికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. రత్నం అనుభవం, సినిమా రంగంలో ఆయనకున్న పరిచయాలు ఈ పదవికి సరైనవని పవన్ భావించారు. ఈ ప్రతిపాదనతో రత్నం నియామకం దాదాపు ఖాయమైనట్లేనని అందరూ అనుకున్నారు.
అయితే, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ను తీసుకొచ్చారు. ఆయన కూడా ఈ పదవికి మరొక సమర్థుడైన వ్యక్తి పేరును సిఫార్సు చేసినట్లు సమాచారం. బాలకృష్ణ ప్రతిపాదించిన వ్యక్తి కూడా సినిమా రంగానికి చెందినవారేనని, ఈ పదవికి అర్హులైన వ్యక్తిని ఎంచుకున్నారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ వంటి కీలక నేత ప్రతిపాదించిన పేరు, మరోవైపు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉన్న బాలకృష్ణ సిఫార్సు చేసిన పేరు... ఈ రెండింటిలో ఏది ఫైనల్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వంలో ఇద్దరు కీలక వ్యక్తుల ప్రతిపాదనలు కావడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాలి. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ఈ పదవి విషయంలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు