వారణాసి గ్లింప్స్: మహేష్ బాబు స్పీచ్ లో అది మిస్సింగ్ ..ఫ్యాన్స్ డిసప్పాయింట్..!
సినిమా గురించి మాట్లాడుతూ ఆయన మరింత భావోద్వేగంతో చెప్పారు—“వారణాసి నా డ్రీమ్ ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే సినిమా ఇది. ఈ ప్రాజెక్ట్ కోసమే నా శక్తిని పూర్తిగా వినియోగిస్తాను. అందరూ గర్వపడేలా, ముఖ్యంగా నా దర్శకుడు రాజమౌళి గారే గర్వపడేలా నేను పని చేస్తాను. ఈ సినిమా విడుదలైనప్పుడు యావత్ దేశం గర్వపడేలా ‘వారణాసి’ నిలుస్తుంది” అని తెలిపారు.అయితే మహేశ్ బాబు ఈసారి స్టేజ్పై మాట్లాడిన తీరు చాలామందిని ఆకట్టుకుంది… అయితే కొందరిని ఆలోచింపజేసింది కూడా. సాధారణంగా మహేశ్ బాబు స్పీచ్ అంటే చలాకీతనం, సరదా జోకులు, పంచులు–ఇవి తప్పవు. కానీ ఈ ఈవెంట్లో మాత్రం ఆయన స్వరం కొద్దిగా వణికినట్టూ, మాటల్లో తడబడినట్టూ కనిపించిందని ప్రేక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు. గ్లింప్స్ వీడియో ఆలస్యంగా రావడం… రాజమౌళి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకోవడం… ఈ రెండు విషయాలు మహేశ్ మనసుపై ఒత్తిడిని కలిగించి ఉండొచ్చని ఇండస్ట్రీ టాక్.
ఈ చిత్రంలో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ, కార్తికేయ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ‘వారణాసి’, మహేష్ బాబు కెరీర్లోనే కాదు—భారతీయ సినీ పరిశ్రమలో కొత్త ప్రమాణాలను సృష్టించే చిత్రంగా నిలుస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.