డ్రగ్స్ కేసులో నటి హేమకు భారీ గుడ్ న్యూస్.. హైకోర్ట్ కీలక తీర్పు..!

Divya
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి నటి గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది హేమ. గత ఏడాది బెంగళూరు శివారులలో జరిగిన రేవ్ పార్టీ కేసులో హేమ పేరు కూడా తెరపైకి వచ్చింది. మాధకదవ్యాల వినియోగం కేసు కూడా నమోదయింది దీంతో కొద్దిరోజులు జైలు జీవితాన్ని గడిపింది హేమ. అలాగే హేమతో పాటుగా శాంతిభద్రతలను విఘాతం కలిగించారనే అభియోగంతో 88 మందిని అరెస్టు చేశారు.ఈ విషయంపై చాలామంది హేమను ట్రోల్ చేశారు.



వైద్య పరీక్షల తర్వాత కేసు కొట్టి వేయాలంటూ నటి హేమ హైకోర్టుని ఆశ్రయించగా ,హేమ ఫిటిషన్  హైకోర్టు స్వీకరించి నిందితులపైన NDPS కేసును కొనసాగించడానికి ఎటువంటి చట్టపరమైన ఆధారాలు లేవని నిర్ధారించింది. ఇప్పుడు తాజాగా ఈ విషయం పైన కేసు కొట్టి వేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ (డిసెంబర్ 9) తీర్పు ఇచ్చింది. ఈ కేసు కొట్టి వేసిన తర్వాత నటి హేమ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఈ కేసు వల్లే తన తల్లి చాలా మానసికంగా కృంగిపోయి మరణించిందని తెలియజేస్తూ అందరి ముందే కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో హేమకి ఈ కేసు కొట్టి వేయడంతో భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు.


తెలుగులో వందలాది చిత్రాలలో సహాయ నటిగా నటించిన హేమ. హీరో హీరోయిన్స్ కి తల్లిగా, పిన్నిగా, అక్కగా నటించి భారీగానే పేరు సంపాదించింది. గతంలో కూడా తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొనింది. అలా పలు రకాల టీవీ షోలలో సందడి చేయడమే కాకుండా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో చాలా కీలకమైన బాధ్యతలను కూడా నిర్వహించింది. అయితే తన మీద వచ్చిన డ్రగ్స్ కేసు ఆరోపణలవల్ల సినిమా అవకాశాలు తగ్గాయి.. అయితే తిరిగి మళ్లీ తాను సినిమాలలో ఇక ధైర్యంగా నటిస్తానంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది హేమ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: