వారణాసి: రాజమౌళి బడా ప్లాన్.. మరో స్టార్ యాక్టర్ ఎంట్రీ..!

Divya
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి. ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కూడా రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా సంబంధించి భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించి టైటిల్ టీజర్ విడుదల చేయగా అంచనాలను పెంచేశాయి. అలాగా పాటలు కూడా మరింత హైప్ పెంచేశాయి. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించగా, విలన్ గా పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటీనటుల గురించి మాత్రం చిత్ర బృందం ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కానీ తాజాగా సోషల్ మీడియాలో మాత్రం ఒక విషయం వైరల్ అవుతోంది.



అదేమిటంటే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ ను ఎంచుకున్నట్లుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మొదట ఈ సినిమాలోని పాత్ర కోసం బాలీవుడ్ నటుడు నానాపటేకర్ ను సంప్రదించారని, కానీ చివరికి ప్రకాష్ రాజ్ ను తీసుకున్నట్లుగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజమౌళి ,ప్రకాష్ రాజ్ గతంలో విక్రమార్కుడు సినిమా సమయంలో కలిసి పని చేశారు. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా కనిపించలేదు ప్రకాష్ రాజ్.


ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కలిసి పనిచేయబోతున్నారు. ఈమధ్య ప్రకాష్ రాజ్ సినిమాలలో కంటే ఇతర విషయాలలోనే ఈ నటుడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన OG చిత్రంలో కూడా కీలకపాత్ర పోషించడంతో ఈ పాత్రకి మంచి పేరు లభించింది. అలాగే హీరో విజయ్ దళపతి నటించిన జననాయగన్ వంటి చిత్రంలో కూడా నటించబోతున్నారు. ప్రకాష్ రాజ్  ఎక్కువగా పొలిటికల్ పరంగా యాక్టివ్ గా ఉంటూ  అన్ని విషయాలపైన స్పందిస్తున్నారు. మరి వారణాసి సినిమాలో వస్తున్న ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: