బుకింగ్స్‌లో అఖండ 2 తాండ‌వం.. బాల‌య్య వీర‌విహారం ఇది... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్. వీరిద్దరి హ్యాట్రిక్ కాంబోలో వచ్చిన ‘అఖండ’ భారీ విజయం సాధించాక, దానికి సీక్వెల్‌గా వచ్చిన “ అఖండ 2: తాండవం ” ఇప్పుడు థియేటర్ల వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ చిత్రం కేవలం మాస్ ఆడియన్స్‌నే కాకుండా , ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.


రికార్డు స్థాయిలో టికెట్ సేల్స్ :
తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్స్ అయిన బుక్ మై షో - డిస్ట్రిక్ట్ యాప్స్ ద్వారా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. విడుదలైన అతి తక్కువ రోజుల్లోనే 20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. వీక్ డేస్‌లో కూడా ఈ సినిమా డీసెంట్ హోల్డ్‌ను కనబరుస్తుండటం బాలయ్య బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపిస్తోంది. ఈ సినిమా లో బాలకృష్ణ సరసన సంయుక్త మీనన్ నటించగా, 'భజరంగీ భాయ్‌జాన్' ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో కనిపించింది. విలక్షణ నటుడు ఆది పినిశెట్టి పవర్‌ఫుల్ పాత్రలో మెప్పించారు.


స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ . ఎస్ . అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా 3D వెర్షన్‌లో కూడా విడుదలై ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. ఆధ్యాత్మికతను, సామాజిక అంశాలను జోడించి బోయపాటి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'అఖండ 2' తన విజయయాత్రను కొనసాగిస్తోంది. లాంగ్ రన్‌లో ఈ చిత్రం మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: