ఓజి సీక్వెల్ పై ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్.. ఈసారీ జానీ కాదు అదే.. పవన్ ఫ్యాన్స్కు డబుల్ పండుగ..!?
ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని మూవీ విడుదల సమయంలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అప్పట్లోనే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ‘ఓజి’ సీక్వెల్ను ప్రస్తుతం తెరకెక్కించడం లేదని మేకర్స్ స్పష్టత కూడా ఇచ్చారు. ఆ ప్రకటనతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. అయితే, తాజాగా ఈ సీక్వెల్ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన టాక్ సినీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. దర్శకుడు సుజిత్ ఈ సీక్వెల్ను ఎలాగైనా తెరకెక్కించాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఈ వార్తతో పవర్ స్టార్ అభిమానుల్లో ఒక్కసారిగా ‘ఓజి’ సీక్వెల్పై ఆసక్తి మరింత పెరిగింది. యూవీ క్రియేషన్స్ మటే అందరికి ప్రభాస్ నే గుర్తు వస్తాడు. ఒక్కవేళ్ల సాహో-ఓజీ లని ఇన్వాల్వ్ చేస్తూ ఓకీ 2 లో ప్రభాస్ ని చూపిస్తే..ఇక రచ్చ రంబోలానే. అయితే నిజంగానే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుందా? పవన్ కళ్యాణ్ మళ్లీ ఈ పాత్రలో కనిపిస్తారా? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్పైకి వెళ్లనుంది? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వస్తున్నాయి.ఈ అన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం రావాలంటే మాత్రం మేకర్స్ నుంచి వచ్చే అధికారిక ప్రకటన వరకు అభిమానులు ఓపికగా వెయిట్ చేయాల్సిందే. అప్పటివరకు ఈ వార్తలు కేవలం ఊహాగానాలుగానే భావించాల్సి ఉంటుంది.