ఆ తెలుగు హీరో నన్ను బెదిరించారు..సెన్సేషనల్ విషయాని బయటపెట్టిన మీనా..!

Thota Jaya Madhuri
ఒకప్పుడు దక్షిణాది సినీ ఇండస్ట్రీని ఏలిన అగ్ర కథానాయికల్లో మీనా ఒకరు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె, తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. కథానాయకుడితో సమానమైన ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ, సహజ నటనతో ‘ఎవర్ గ్రీన్ హీరోయిన్’గా గుర్తింపు పొందారు.తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్ వంటి అగ్ర హీరోల సరసన నటించి, టాప్ హీరోయిన్‌గా కొనసాగిన మీనా, తమిళంలోనూ స్టార్ హీరోలతో జోడీ కట్టారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో వివాహం చేసుకుని, కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, అనూహ్యంగా ఆమె భర్త మరణించడంతో పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా — ముఖ్యంగా తల్లి, అత్త, పిన్ని, వదిన వంటి పాత్రల్లో మెప్పిస్తూ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.



ఇటీవల మీనా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన సినీ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీనా తన స్వభావాన్ని వివరించారు.“నేను షూటింగ్ సమయంలో ఎక్కువగా మాట్లాడే దాన్ని కాదు. చాలా సైలెంట్‌గా నా పని నేను చేసుకునేదాన్ని. చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించాను. వాళ్లంతా నాతో చాలా సరదాగా ఉండేవారు, సెట్‌లో మంచి వాతావరణం ఉండేది” అని ఆమె చెప్పారు.



ప్రత్యేకంగా బాలకృష్ణ గురించి మాట్లాడుతూ,“బాలకృష్ణ గారు సెట్‌లో అందరితో సరదాగా ఉంటారు. జోకులు వేస్తూ షూటింగ్ వాతావరణాన్ని హుషారుగా ఉంచేవారు” అని గుర్తు చేసుకున్నారు.  ఆ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా మీనా చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. “మోహన్ బాబు గారు మాత్రం నన్ను కొంచెం బెదిరించేవారు” అంటూ ఆమె చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.



ఆ వ్యాఖ్యను వివరించుతూ మీనా,“అందుకే ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు నేను అస్సలు మాట్లాడేదాన్ని కాదు. చాలా సీరియస్‌గా కనిపించేవారు. కానీ లోపల మాత్రం సరదా మనసు ఉన్న వ్యక్తే. షూటింగ్ సమయంలో ఆయన తన పిల్లలతో ఎంతో ప్రేమగా ఆడుకున్న సందర్భాలు నాకు గుర్తున్నాయి” అని చెప్పారు.అయితే ఈ ‘బెదిరించడం’ అన్న మాటను మీనా సరదాగానే చెప్పిందా? లేక దానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? అనే అనుమానాలు ఇప్పుడు నెటిజన్లలో మొదలయ్యాయి.


మీనా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో, సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.“అసలు మోహన్ బాబు మీనాను ఏ విషయంలో బెదిరించారు?”, “ఇది సరదాగా చెప్పిన మాటనా, లేక నిజంగా ఏదైనా సంఘటన జరిగిందా?”
అంటూ అభిమానులు, నెటిజన్లు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు.మొత్తానికి, దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో పనిచేసిన మీనా, తన అనుభవాలను నిజాయితీగా పంచుకుంటూ మరోసారి వార్తల్లో నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: