450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ‘ది రాజాసాబ్’ కోసం..ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకున్నారంటే? ఫ్యుజులు ఎగిరిపోతాయ్..!
ఈ ఫాంటసీ హారర్ కామెడీ మూవీలో ప్రభాస్కు జంటగా ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, సంజయ్ కుమార్ (పాత్రల ప్రకారం) డార్లింగ్ ప్రభాస్తో రొమాన్స్ చేయడం ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా టీమ్ మొత్తం ప్రమోషన్స్లో బిజీగా మారిపోయింది.ఇదిలా ఉండగా, ఈ సినిమా బడ్జెట్ మరియు రెమ్యునరేషన్స్పై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఎవరు ఎంత పారితోషకం తీసుకున్నారు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ రెమ్యునరేషన్ గురించిన చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తోంది.
సాధారణంగా ప్రభాస్ ఏ సినిమాకు అయినా సరే 100 కోట్లకు తక్కువ రెమ్యునరేషన్ తీసుకోడు అనే విషయం తెలిసిందే. కానీ ఈ మూవీ విషయంలో మాత్రం నిర్మాతల బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ పెద్ద మనసు చూపారని టాక్. సమాచారం ప్రకారం, ఈ సినిమాకు ప్రభాస్ సుమారు 80 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నారట. సినిమా మొత్తం బడ్జెట్ను కంట్రోల్లో ఉంచాలనే ఉద్దేశంతో తన పారితోషకాన్ని స్వయంగా తగ్గించుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇక దర్శకుడు మారుతి ఈ సినిమాకు సుమారు 20 కోట్ల రూపాయల పారితోషకం తీసుకున్నారని సమాచారం. అలాగే హీరోయిన్ల రెమ్యునరేషన్ విషయానికి వస్తే, సంజయ్ సుమారు 8 కోట్లు, నిధి అగర్వాల్ దాదాపు 2 కోట్లు, మాళవిక మోహన్ మరియు కుమార్ ఒక్కొక్కరు సుమారు 1 కోటి రూపాయల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్, డిఫరెంట్ జానర్, ప్రభాస్ కామెడీ టైమింగ్—అన్ని కలిసివచ్చి “రాజా సబ్” సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.