మహేష్బాబు బెంగళూరు AMB : ఈ రేర్ ఫీట్ గురించి తెలుసా... !
సాంకేతిక పరంగా ఈ థియేటర్ సరికొత్త బెంచ్మార్క్ సెట్ చేసింది. ప్రధాన స్క్రీన్ సుమారు 65 అడుగుల విశాలమైన కర్వ్డ్ డిజైన్తో ఉండి, ఏకకాలంలో 586 మంది వీక్షించే సామర్థ్యం కలిగి ఉంది. అత్యంత స్పష్టమైన విజువల్స్ కోసం డ్యూయల్ ప్రొజెక్షన్ 4K టెక్నాలజీని ఇక్కడ వినియోగించారు. సౌండ్ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా 64 ఛానల్ ఆబ్జెక్ట్ బేస్డ్ డాల్బీ అట్మాస్ సిస్టమ్ను ఏర్పాటు చేయడం విశేషం. దీనివల్ల ప్రతి శబ్దం ఎంతో సహజంగా, స్పష్టంగా వినిపిస్తుంది. కేవలం సాంకేతికత మాత్రమే కాకుండా, ప్రేక్షకుల సౌకర్యం కోసం కర్వ్డ్ స్టేడియం శైలిలో సీటింగ్ను రూపొందించారు. దీనివల్ల థియేటర్ లోని ఏ మూల కూర్చున్నా తెరపై దృశ్యాలు ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి.
ఈ ప్రతిష్టాత్మక డాల్బీ విజన్ స్క్రీన్ పై ప్రదర్శితమైన తొలి చిత్రంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' నిలిచింది. ఈ సినిమాను ప్రత్యేకంగా డాల్బీ విజన్ టెక్నాలజీకి అనుగుణంగా గ్రేడింగ్ చేయడం సినిమా ప్రేమికులకు ఒక గొప్ప విజువల్ ట్రీట్గా మారింది. మెగాస్టార్ మాస్ పవర్, మహేశ్ బాబు బ్రాండ్ విలువ కలిగిన థియేటర్ తోడవ్వడంతో బెంగళూరు సినీ వర్గాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ మల్టీప్లెక్స్లో మొత్తం తొమ్మిది స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఐదు డాల్బీ అట్మాస్, నాలుగు డాల్బీ 7.1, రెండు ఫ్లాట్ స్క్రీన్లు ఉండటం వల్ల ప్రేక్షకులకు విభిన్న రకాల ఎంపికలు లభిస్తాయి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఈ థియేటర్ విశేషాలను పంచుకుంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏఎంబీ టీమ్ పడిన కష్టానికి ఫలితం దక్కిందని, బెంగళూరు ప్రజలకు ఒక మర్చిపోలేని అనుభూతిని అందించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ లో ప్రారంభించిన ఏఎంబీ సినిమాస్ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్ ను బెంగళూరులో కూడా ఏఎంబీ రిపీట్ చేస్తోంది.