చిరు జీవికైనా చిరంజీవికైనా అదే చాలా ముఖ్యం.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
అమృతం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన హర్షవర్ధన్, టాలీవుడ్లో నటుడిగా, దర్శకుడిగా మరియు సంభాషణల రచయితగా తనదైన ముద్ర వేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న ఆయన, ఇటీవల విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంలో కీలక పాత్ర పోషించి తన నటనతో మరోసారి మెప్పించారు. ఈ క్రమంలో సినిమా విజయానికి పబ్లిసిటీ ఎంత ముఖ్యమో వివరిస్తూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆది సాయికుమార్ నటించిన 'శంబాల' సినిమాకు సంబంధించి గతేడాది ఏప్రిల్ నుంచే పకడ్బందీగా ప్రమోషన్స్ నిర్వహించడం ఆ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ అయిందని ఆయన విశ్లేషించారు.
అదే సమయంలో 'ఛాంపియన్' సినిమా గురించి ప్రస్తావిస్తూ, కంటెంట్ పరంగా ఆ సినిమా చాలా బాగున్నప్పటికీ, ప్రమోషన్ల విషయంలో వెనుకబడిందని హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని 'ఛాంపియన్' చిత్ర నిర్మాతలు కూడా గమనించాలని, ఆ స్థాయి చిత్రానికి ఇంకా భారీగా పబ్లిసిటీ కల్పించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కేవలం మంచి సినిమా తీస్తే సరిపోదని, అది ప్రేక్షకులకు చేరాలంటే సరైన ప్రచార ఆయుధం అవసరమని ఆయన నొక్కి చెప్పారు.
ప్రమోషన్ల ప్రాముఖ్యతను వివరిస్తూ "చిరు జీవికైనా, చిరంజీవికైనా పబ్లిసిటీ ఒక్కటే ప్రధానం" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. సినిమా చిన్నదైనా, పెద్దదైనా ప్రమోషన్స్ బలంగా చేస్తేనే ప్రేక్షకులు థియేటర్ల వరకు వస్తారనేది వంద శాతం నిజమని ఆయన స్పష్టం చేశారు. కంటెంట్ ఎంత బలంగా ఉన్నా, సరైన పబ్లిసిటీ తోడైతేనే బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అందుకోవచ్చని హర్షవర్ధన్ తన అనుభవంతో విశ్లేషించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.